తెలంగాణ (Telangana Projects) ప్రభుత్వం పలు కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలు కోసం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. వీటిలో ప్రధానమైనది, హైదరాబాద్ (Hyderabad) మెట్రో రెండవ దశ విస్తరణ ప్రాజెక్టును (project) కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా చేపట్టేందుకు ఆమోదం తెలపాలని కోరింది. ఇది హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
Read Also: Nitish Kumar : నితీష్ ముందు ఎన్నో సవాళ్లు!

ప్రతిపాదిత ప్రధాన ప్రాజెక్టులు
- RRR (రీజినల్ రింగ్ రోడ్డు): రీజినల్ రింగ్ రోడ్డు యొక్క ఉత్తర మరియు దక్షిణ భాగాల నిర్మాణానికి త్వరగా అనుమతులివ్వాలని కోరింది. అంతేకాకుండా, RRR మార్గానికి అనుసంధానంగా రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టును కూడా చేపట్టాలని విజ్ఞప్తి చేసింది.
- మన్ననూర్-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్: మన్ననూర్-శ్రీశైలం మధ్య 4 వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి తగిన అనుమతులు ఇవ్వాలని కోరింది.
- ఎక్స్ప్రెస్ హైవేలు:
- హైదరాబాద్-అమరావతి-మచిలీపట్నం పోర్ట్ మధ్య 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి చొరవ చూపాలని.
- హైదరాబాద్-బెంగళూరు (HYD-BLR) మధ్య మరో గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి చొరవ చూపాలని కోరింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: