Telangana Pensions: తెలంగాణ రాష్ట్రంలోని చేయూత పింఛన్ల లబ్ధిదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించేందుకు సిద్ధమవుతోంది. ఆర్థిక పరిస్థితులను బట్టి పింఛన్ల మొత్తాన్ని పెంచాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. దీనికి సంబంధించిన కసరత్తును ఆర్థిక శాఖ ఇప్పటికే ప్రారంభించింది.
Read Also: Senior Sweeper Salary: తెలంగాణలో స్వీపర్ జీతం రూ. 2 లక్షలు
విడతల వారీగా పింఛన్ల పెంపు
ప్రస్తుతం రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, చేనేత, బీడీ కార్మికులకు నెలకు ₹2,016 అందజేస్తుండగా, దివ్యాంగులకు ₹4,016 చొప్పున పింఛన్ అందుతోంది. తాజా ప్రతిపాదన ప్రకారం, ప్రాథమికంగా అందరికీ ₹500 చొప్పున పెంచాలని ప్రభుత్వం (Government) భావిస్తోంది. ప్రస్తుతం పింఛన్ల కోసం ప్రతి నెలా సుమారు ₹950 కోట్లు ఖర్చవుతుండగా, ఈ ₹500 పెంపు వల్ల ఏడాదికి అదనంగా ₹2,500 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.
ఎన్నికల హామీ మేరకు పింఛన్లను భారీగా పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అయితే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఒకేసారి కాకుండా విడతల వారీగా ఈ పెంపును చేపట్టనున్నారు. వచ్చే ఎన్నికల నాటికి సాధారణ పింఛన్లను ₹4,000లకు, దివ్యాంగుల పింఛన్లను ₹6,000లకు పెంచాలని యోచిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: