Camp politics india : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. దాదాపు 40 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ పరిస్థితి ఏర్పడింది. దీంతో మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ముందు సభ్యులను కాపాడుకోవడానికి ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి.
కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు స్వతంత్రులు మరియు ఇతర పార్టీల నుంచి గెలిచిన సభ్యులను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొన్ని చోట్ల ఫలితాలు రాకముందే గెలుస్తామని భావించిన సభ్యులను క్యాంపులకు తరలించగా, హంగ్ ఏర్పడిన ప్రాంతాల్లో ఇప్పుడు ఈ చర్యలు మరింత వేగం పుంజుకున్నాయి.
జమ్మికుంట మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు మెజారిటీ రాకపోవడంతో ఇరు వర్గాలు ఇండిపెండెంట్ సభ్యులను క్యాంపులకు తరలించాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని, ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్, కాగజ్నగర్ వంటి ప్రాంతాల్లో కూడా సంఖ్యాబలం కోసం తీవ్ర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
Read Also: T20WC: ఐర్లాండ్ పై ఆస్ట్రేలియా ఘన విజయం
అనేక చోట్ల బీఆర్ఎస్–కాంగ్రెస్ మధ్య పోటీ తారాస్థాయికి చేరగా, స్వతంత్ర సభ్యులు కీలకంగా మారారు. వారిని తమవైపు తిప్పుకునేందుకు లక్షల్లో ఆఫర్లు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఈ నెల 16న ప్రమాణస్వీకారం చేయనుండగా, అదే రోజు ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో సభ్యులు చేజారిపోకుండా రాజకీయ పార్టీలు క్యాంపులను నిర్వహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సభ్యులను ఇతర రాష్ట్రాలకు తరలించారని కూడా సమాచారం. ఘర్షణలు, ఆరోపణల మధ్య స్థానిక రాజకీయాలు మరింత ఉత్కంఠభరితంగా మారాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: