Telangana municipal exit polls : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఏడు నగరపాలక సంస్థల పరిధిలోని 412 డివిజన్లు, 116 మున్సిపాలిటీల్లోని 2,569 వార్డులకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరిగింది. తాజా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించినట్లు అంచనా.
పీపుల్స్ సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ వివరాల ప్రకారం మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ 68 నుంచి 76 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్కు 29 నుంచి 36 స్థానాలు, బీజేపీకి 3 నుంచి 5 స్థానాలు, ఇతరులకు 8 నుంచి 14 స్థానాలు రావచ్చని అంచనా వేయబడింది.
వార్డు స్థాయిలో కూడా కాంగ్రెస్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం 2,569 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 1210 నుంచి 1290 వార్డులు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. బీఆర్ఎస్కు 860 నుంచి 930, బీజేపీకి 250 నుంచి 270, ఎంఐఎంకు 35 నుంచి 44 వార్డులు దక్కవచ్చని అంచనా.
Read Also: Shivraj Singh: తెలుగు రాష్ట్రాల రైతులపై అప్పుల భారం ఎక్కువ
ఓట్ షేర్ పరంగా చూస్తే కాంగ్రెస్కు సుమారు 36 శాతం ఓట్లు వచ్చినట్లు అంచనా. బీఆర్ఎస్కు 29.7 శాతం, బీజేపీకి 19.3 శాతం ఓటు శాతం నమోదైనట్లు పేర్కొన్నారు.
ఇక ఇతర పార్టీల విషయానికి వస్తే సీపీఐకి 12 నుంచి 17, సీపీఐ(ఎం)కు 10 నుంచి 14 వార్డులు రావచ్చని అంచనా. ఇతరులకు 90 నుంచి 110 స్థానాలు దక్కవచ్చని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. తుది ఫలితాలు అధికారిక లెక్కింపుతో స్పష్టమవుతాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: