📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News:Telangana: పత్తి రైతుల దుస్థితిపై ఎమ్మెల్సీ కవిత ఆవేదన

Author Icon By Pooja
Updated: November 3, 2025 • 5:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో(Telangana) పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తేమ శాతం పేరుతో కొనుగోలు కేంద్రాల్లో సీసీఐ అధికారులు రైతులను మోసం చేస్తున్నారని ఆమె విమర్శించారు. దీంతో రైతులు గిట్టుబాటు ధర కోల్పోయి ప్రైవేట్ వ్యాపారులకు పత్తిని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె తెలిపారు.

Read Also: Chevella: ఈ పిల్లలకు దిక్కెవరు? ..అమ్మానాన్నల కోసం కన్నీరు మున్నీరు

Telangana

జాగృతి జనం బాట కార్యక్రమంలో కవిత పర్యటన
ఆదిలాబాద్ జిల్లాలో జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా కవిత(Kavitha) పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – “సీసీఐ అధికారులు తేమ సాకుతో పత్తిని కొనుగోలు చేయడం నిరాకరిస్తున్నారు. రైతులు నష్టపోతున్నారు. బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ రైతుల సమస్యలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు” అని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డికి హితవు
పత్తి రైతుల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని, జూబ్లీహిల్స్‌లో ప్రచార కార్యక్రమాలు ఆపి, రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కవిత సూచించారు. తేమ శాతాన్ని కారణంగా చూపకుండా సీసీఐ గిట్టుబాటు ధరకు పత్తిని కొనుగోలు చేయేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

ఆదివాసీలతో భేటీ, గౌరవస్వీకారం
ఆదిలాబాద్‌ చేరుకున్న కవితకు తెలంగాణ(Telangana) జాగృతి నాయకులు, ఆదివాసీలు సంప్రదాయ వాయిద్యాలు, గుస్సాడీ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కొమురం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత స్థానిక రైతులు, ఆదివాసీలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

CottonFarmers Google News in Telugu RevanthReddy Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.