📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News:Telangana-దేవుళ్ల వద్ద రాజకీయం చేసిననాయకులెవరు ఎదగలే– మంత్రి సీతక్క

Author Icon By Sushmitha
Updated: September 10, 2025 • 11:44 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర నిర్వహణపై రాష్ట్ర మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టి సారించారు. దేశం మొత్తం గర్వించేలా జాతర అభివృద్ధి పనులను చేపట్టాలని, ఈ విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. వచ్చే సంవత్సరం జనవరి 28 నుండి 31వ తేదీ వరకు జరగనున్న ఈ మహా జాతరకు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించడానికి సీఎం వారంలోగా పర్యటిస్తారని మంత్రి చెప్పారు.

150 కోట్లతో అభివృద్ధి పనులు, సీఎం పర్యటన

మంగళవారం మంత్రి సీతక్క(Minister Sitakka) మేడారం గ్రామంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ డాక్టర్ శబరిష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచంద్ర లతో కలిసి ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న విఐపి పార్కింగ్ రోడ్డు, పోలీస్ కంట్రోల్ రూమ్, హరిత హోటల్ వంటి ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం మేడారంలోని ఐటీడీఏ సమావేశపు హాల్లో అమ్మవార్ల పూజారులు, అన్ని శాఖల అధికారులతో మేడారం జాతర 2026పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భక్తుల సౌకర్యాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.150 కోట్లను కేటాయించిందని, ఈ నిధులతో అధికారులు 100 రోజుల నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు

గద్దెల ప్రాంతంలో ఆదివాసీ(Adivasi) సంప్రదాయాలకు, పూజారుల మనోభావాలకు అనుగుణంగా శాశ్వతంగా ఉండే విధంగా నూతన హంగులతో అభివృద్ధి పనులు చేయాలని సూచించారు. మేడారం గ్రామస్థులు, పూజారుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ఈ జాతర రాష్ట్ర పండుగతో పాటు మరో కుంభమేళా తరహాలో జరగనుందని, దీనికి సాధారణ పౌరుల నుండి రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి ముఖ్యులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వివిఐపిలకు ఇబ్బందులు లేకుండా విమానాలు సైతం దిగే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆమె అన్నారు. దేవుళ్ల ప్రాంతంలో రాజకీయాలు చేసే ఏ నాయకుడూ ఎదగలేరని, రాబోయే మహా జాతరను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు. భక్తుల్లో అమ్మవార్లపై భక్తి, విశ్వాసం పెంపొందించేలా జాతర ఏర్పాట్లు చేయాలని సూచించారు.

మేడారం జాతర 2026 ఎప్పుడు జరుగుతుంది?

వచ్చే సంవత్సరం జనవరి 28 నుండి 31వ తేదీ వరకు జరగనుంది

మేడారం జాతర కోసం ప్రభుత్వం ఎంత నిధులు కేటాయించింది?

భక్తుల సౌకర్యాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 150 కోట్ల రూపాయలను కేటాయించింది.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/telugu-news-abdul-nazir-government-towards-unique-innovation/andhra-pradesh/544325/

development works Google News in Telugu Latest News in Telugu Medaram Jatara minister seethakka public facilities telangana government Telugu News Today tribal tradition

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.