Telangana: నీటి హక్కులపై ద్రోహం చేస్తున్నారని కాంగ్రెస్‌పై కేటీఆర్

Read Time:  1 min
Telangana
Telangana
FONT SIZE
GET APP

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR) తీవ్ర పదజాలంతో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. 2028 ఎన్నికల్లో తెలంగాణ(Telangana) ప్రజలు కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లా కోస్గిలో జరిగిన సభలో మాట్లాడిన కేటీఆర్‌, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలకు ఘాటైన కౌంటర్ ఇచ్చారు.

Read Also: TG Politics: సీఎం వ్యాఖ్యలపై హరీశ్ రావు ఆగ్రహం

నీటి హక్కుల అంశంపై సమాధానం చెప్పలేని పరిస్థితిలోనే ముఖ్యమంత్రి ఇలాంటి అసభ్య వ్యాఖ్యలకు దిగుతున్నారని కేటీఆర్(KTR) మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. సొంత జిల్లాకు కూడా న్యాయం చేయలేకపోతున్నారని, జల హక్కులపై రాజీపడుతూ తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టం

తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే రాజకీయాలను బీఆర్‌ఎస్ ఎప్పటికీ సహించదని కేటీఆర్ స్పష్టం చేశారు. నీటి ద్రోహం, రైతాంగానికి జరుగుతున్న అన్యాయం వంటి అంశాలపై అసెంబ్లీలోనే కాకుండా ప్రజాసభల్లో కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయం వచ్చినప్పుడు తగిన నిర్ణయం తీసుకుంటారని హెచ్చరించారు.

తెలంగాణ కోసం పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రానికి నష్టం జరిగితే చూస్తూ ఊరుకునే పార్టీ బీఆర్‌ఎస్ కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. రైతుల హక్కులకు భంగం కలిగితే ఉద్యమాల ద్వారా ప్రతిఘటిస్తామని చెప్పారు. చివరగా, 2028లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.