తెలంగాణలో రాబోయే ఖరీఫ్ సీజన్లో ఎరువుల కొరత రాకుండా చూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జూన్ వరకు ప్రతి నెలా 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డిమాండ్ ఎక్కువగా ఉండే జూలై, ఆగస్టు నెలల్లో కనీసం 3 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని వివరించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాకు ఆయన ఒక లేఖ రాస్తూ రాష్ట్ర అవసరాలను స్పష్టంగా వివరించారు.
Read also: Telangana Board Exam 2026: రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు
Tummala Nageswara Rao: Allocate sufficient urea for the Kharif season.
రైతులకు ఇబ్బంది కలగకుండా ముందస్తుగా నిల్వలు
రాష్ట్రంలో ప్రస్తుతం యూరియా నిల్వలు కేవలం 50 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉండవచ్చని మంత్రి అంచనా వేశారు. గత ఏడాది నిల్వలు ఎక్కువగా ఉండటం వల్ల ఎరువుల సరఫరా సాఫీగా సాగిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏప్రిల్ నెల నుండే సరైన కేటాయింపులు జరిగితే ప్రభుత్వం ముందస్తుగా బఫర్ స్టాక్ ఏర్పాటు చేసుకుంటుందని తెలిపారు. దీనివల్ల సాగు సమయంలో రైతులకు ఎలాంటి అంతరాయం కలగకుండా యూరియా అందుబాటులో ఉంటుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
వ్యవసాయ ఉత్పత్తి స్థిరత్వానికి యూరియా సరఫరా అత్యవసరం
తెలంగాణ సాగు విస్తీర్ణంలో 70 శాతం పంటలు ఖరీఫ్ సీజన్లోనే సాగవుతాయని మంత్రి తుమ్మల వివరించారు. ముఖ్యంగా వరి పత్తి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటలకు యూరియా వినియోగం అత్యధికంగా ఉంటుందని తెలిపారు. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో సీజన్ ముందుగానే ప్రారంభమవుతుందని, అందుకే త్వరగా స్పందించాలని కోరారు. నిరంతర ఎరువుల సరఫరా ద్వారానే వ్యవసాయ ఉత్పత్తిలో స్థిరత్వం సాధించగలమని ఆయన కేంద్రానికి విన్నవించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: