📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana: భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగంతో అధిక దిగుబడులు

Author Icon By Tejaswini Y
Updated: March 5, 2026 • 10:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana: భూసార పరీక్షల ఆధారంగా ఎరువులను వినియోగించడం ద్వారా పంటల దిగుబడి పెరగడంతోపాటు నేల ఆరోగ్యం దీర్ఘకాలికంగా మెరుగుపడుతుందని అన్నదాతలకు ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిశోధనా డైరెక్టర్ డాక్టర్ ఎ. బలరాం సూచించారు. సమతుల్య ఎరువుల వినియోగం, సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొం దించడం ద్వారా సుస్థిర వ్యవసాయాన్ని సాధించవచ్చని పేర్కొన్నారు.

Read also: Chittoor Crime: రూ. 2 లక్షల కోసం స్నేహితుడి హత్య

Telangana: Higher yields with fertilizer use based on soil tests
సేంద్రియ ఎరువుల వినియోగంపై రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం

ఈమేరకు నేల పరీక్షలు, స్థానిక వాతావరణ ప్రభావాలు, పంటల వ్యవస్థలు, సేంద్రియ ఎరువుల వినియోగంపై రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం బుధవారం సెంటర్ ఫర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్(సిహెచ్ఎర్త్లో) లో ప్రారంభమైంది. ఈ రకమైన శిక్షణ ద్వారా సొంతంగా లాబరేటరీని ఏర్పాటు చేసుకునే నైపుణ్యం పొందవచ్చని తెలిపారు. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాజెక్ట్ అధికారి డా. ఎస్. శ్రీనివాస్ మాట్లాడుతూ… రైతులకు శాస్త్రీయ వ్యవ సాయ పరిజ్ఞానం చేరేలా ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతో ఉపయో గకరమని చెప్పారు. పరిశోధనా సంస్థలు అభివృద్ది చేసిన సాంకేతికతలను రైతులకు చేరవేయడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచవచ్చని తెలిపారు.

సిహెచ్ఎర్డీ డైరెక్టర్ డా. ఎం. జగన్ మోహన్రెడ్డి మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమం రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను పరిచయం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందన్నారు. ఈ శిక్షణలో నేల నమూనాల సేకరణ, నేల పరీక్ష విధానాలు, నేల పరీక్ష ఫలితాల విశ్లేషణ, వాతావరణ ప్రభావాల అవగాహన, పంటల ప్రణాళిక, సేంద్రియ ఎరువుల వినియోగం వంటి శాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేల ఆరోగ్య విభాగం ప్రధాన శాస్త్రవేత్తలు శ్రీదేవి. సుకృతకుమార్, డా. ఎం. శంకర్, డా. రెడ్డిప్రియ తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

PJTSAU Research Director Dr. A. Balaram Soil Health Management Soil Testing for Farmers Sustainable Agriculture Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.