హైదరాబాద్: దేశవ్యాప్తంగా రాష్ట్రాల రెవెన్యూ పరిస్థితులపై కంప్టోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) తాజా నివేదిక విడుదల చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన ఈ ఆడిట్లో, 28 రాష్ట్రాలలో 16 రాష్ట్రాలు రెవెన్యూ మిగులులో(revenue surplus) ఉండగా, మిగిలిన 12 రాష్ట్రాలు మాత్రం రెవెన్యూ లోటులో ఉన్నట్లు స్పష్టమైంది.
రెవెన్యూ మిగులు రాష్ట్రాల జాబితాలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. యూపీకి రూ.37,263 కోట్ల రెవెన్యూ మిగులు లభించగా, గుజరాత్ రూ.19,456 కోట్లు, ఝార్ఖండ్ రూ.13,564 కోట్లు, కర్ణాటక రూ.13,494 కోట్లు మిగులతో టాప్ 5 రాష్ట్రాల్లో చోటు దక్కించుకున్నాయి.

రెవెన్యూ మిగులు, లోటు రాష్ట్రాల వివరాలు
ఈ జాబితాలో ఛత్తీస్గఢ్ రూ.8,592 కోట్లతో ఆరో స్థానంలో నిలిచింది. తెలంగాణ రూ.5,944 కోట్ల రెవెన్యూ మిగులుతో ఏడవ స్థానాన్ని సంపాదించింది. అలాగే ఉత్తరాఖండ్ రూ.5,310 కోట్లు, మధ్యప్రదేశ్ రూ.4,091 కోట్లు, గోవా రూ.2,399 కోట్లతో టాప్ 10లో నిలిచాయి.
మరోవైపు, రెవెన్యూ లోటుతో ఉన్న రాష్ట్రాల సంఖ్య 12గా కాగ్ పేర్కొంది. మొత్తం రెవెన్యూ లోటు రూ.2,22,648 కోట్లుగా ఉండగా, ఈ లోటును భర్తీ చేయడానికి 14వ ఆర్థిక సంఘం(Finance Commission) రూ.86,201 కోట్లు విడుదల చేసింది. ఇది మొత్తం లోటులో 39 శాతంగా ఉంది. బిహార్, కేరళ, మేఘాలయ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు తమ రెవెన్యూ వ్యయంపై 90 నుండి 100 శాతం వరకు కేంద్రం నుంచి రాబడి పొందినట్లు నివేదికలో వెల్లడించింది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు ఎంత రెవెన్యూ మిగులు వచ్చింది?
కాగ్ నివేదిక ప్రకారం, తెలంగాణకు రూ.5,944 కోట్ల రెవెన్యూ మిగులు వచ్చింది.
రెవెన్యూ మిగులులో అగ్రస్థానంలో ఏ రాష్ట్రం ఉంది?
ఉత్తరప్రదేశ్ రూ.37,263 కోట్ల రెవెన్యూ మిగులతో మొదటి స్థానంలో ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: