📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana: త్వరలో 500 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ!

Author Icon By Anusha
Updated: March 4, 2026 • 11:40 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana: తెలంగాణలోని ఉన్నత విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని 13 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బందిని భర్తీ చేసేందుకు కసరత్తు పూర్తయ్యింది. ప్రాథమికంగా 500 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే పోస్టుల భర్తీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Read Also: TGSRTC: బస్సుల్లో దివ్యాంగులకు ఫ్రీ జర్నీ లేదు.. ప్రభుత్వం క్లారిటీ

కాంట్రాక్టు సిబ్బందికి భరోసా.. ఖాళీలపై ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలోని 13 వర్సిటీల్లో ప్రస్తుతం మంజూరైన పోస్టులు 2994 కాగా.. వాటిల్లో 763 మంది రెగ్యులర్‌ బోధన సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అన్ని యూనివర్సిటీల్లోనూ 1174 మంది కాంట్రాక్టు, 544 మంది పార్ట్‌టైం లెక్చరర్లు బోధిస్తున్నారు.ఈక్రమంలో కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగాలకు ఇబ్బంది లేకుండా సుమారు 500 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లను నియమించాల్సి ఉంది.

500 assistant professor posts to be filled soon!

అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీలను మాత్రమే భర్తీ చేయాలని ఏడాది క్రితం విద్యాశాఖ జీవో21 ద్వారా మార్గదర్శకాలు జారీ చేసింది. ఉస్మానియా వర్సిటీలో 250, కాకతీయ వర్సిటీలో 145 పోస్టులతో పాటు శాతవాహన, పాలమూరు తదితర వర్సిటీల్లో స్వల్ప మొత్తంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ఆయా వర్సిటీల పాలకమండళ్ల సమావేశంలో ఆమోదం కూడా తీసుకున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫైల్స్ సీఎంవో పరిశీలనలో ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Assistant Professor Recruitment Telangana University Jobs 2026 University Teaching Vacancies

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.