Telangana gram panchayat : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో నేడు కొత్త పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించనున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు ఈరోజు అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. మొత్తం 12,702 గ్రామ పంచాయతీల్లో ఉదయం 10:30 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో జరుగుతాయి. ముందుగా వార్డు సభ్యులతో ప్రమాణం చేయించగా, అనంతరం సర్పంచ్లు మరియు ఉపసర్పంచ్లు రాజ్యాంగంపై విశ్వాసం ఉంచుతూ గ్రామాభివృద్ధి కోసం పని చేస్తామని ప్రతిజ్ఞ చేయనున్నారు.
Read also: KCR: చంద్రబాబును తెలంగాణకు ద్రోహం చేస్తున్నారంటూ కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు
ప్రమాణ స్వీకారం అనంతరం, కొత్తగా (Telangana gram panchayat) ఎన్నికైన సర్పంచ్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ తొలి సమావేశం జరగనుంది. ఎన్నికల్లో తమను ఆదరించి గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పాలకవర్గం తీర్మానం చేయనుంది. ఇదిలా ఉండగా, గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు దశల్లో పూర్తయ్యాయి. పంచాయతీల గడువు ముగిసి రెండేళ్లు గడిచినా వివిధ కారణాల వల్ల ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. చివరకు ఈ ఏడాది చివర్లో ఎన్నికలు పూర్తి కావడంతో గ్రామాల పాలన మళ్లీ ప్రజాప్రతినిధుల చేతుల్లోకి వెళ్లనుంది. రెండేళ్ల తర్వాత కొత్త పాలకవర్గాలు ఏర్పడటంతో గ్రామీణ ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. వాస్తవానికి డిసెంబర్ 20న ప్రమాణస్వీకారం జరగాల్సి ఉండగా, మంచి రోజులు లేవనే కారణంతో డిసెంబర్ 22కు ప్రభుత్వం వాయిదా వేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: