గోదావరి నదీ జలాల్లో తమకు దక్కాల్సిన హక్కుల విషయంలో ఎలాంటి రాజీకి సిద్ధం కాదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలవరం(Telangana Govt) ప్రాజెక్టు పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న విస్తరణ పనులను తాము అంగీకరించబోమని, ఈ అంశంపై సుప్రీంకోర్టులో బలమైన న్యాయపోరాటం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ముంబైలో సీనియర్ న్యాయ నిపుణులతో సమావేశమై, న్యాయ వ్యూహాలపై చర్చించారు.
Read also: AP: త్వరలో అన్ని విషయాలు మాట్లాడతా: సీఎం చంద్రబాబు
పోలవరం–నల్లమల సాగర్కు వ్యతిరేకంగా న్యాయ చర్యలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం–నల్లమల సాగర్ (బనకచర్ల) ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) తన న్యాయపరమైన చర్యలను వేగవంతం చేసింది. ఈ క్రమంలో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని కలిసి, కోర్టులో రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించేలా చర్చించారు. సంబంధిత అన్ని పత్రాలు, సాంకేతిక నివేదికలు, ఆధారాలను సిద్ధం చేసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం కార్యాలయం అప్రమత్తం చేసింది.
ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్
పోలవరం ప్రాజెక్టును చట్టబద్ధమైన అనుమతులు లేకుండా బనకచర్ల లేదా నల్లమల సాగర్తో అనుసంధానించే విస్తరణ పనులు చేపడుతున్నారని ఆరోపిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పనులను వెంటనే నిలిపివేయాలని, అలాగే పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో కోరింది. ఆమోదం పొందిన అసలు డిజైన్ ప్రకారమే ప్రాజెక్టు నిర్మాణం జరగాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
కేంద్రంపై కూడా అభ్యంతరాలు
తెలంగాణ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం నల్లమల సాగర్ ప్రాజెక్టు నివేదికలను పరిశీలించడాన్ని కూడా పిటిషన్లో తప్పుబట్టింది. కేంద్ర జల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేస్తోందని, ఈ విస్తరణ ప్రాజెక్టులకు సంబంధించిన పర్యావరణ అనుమతులు, ఆర్థిక సహాయాన్ని నిలిపివేయాలని కోర్టును కోరింది. ఈ పిటిషన్ త్వరలోనే సుప్రీంకోర్టు విచారణకు రానుండటంతో, గోదావరి జలాల వివాదం మరో కీలక మలుపు తిరగనుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: