हिन्दी | Epaper
ఉచిత మీమాంస తగునా చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక మేయర్ పీఠం సుప్రీంకోర్టు తీర్పు మరణించిన దూడ తెలంగాణకు శుభవార్త ఎన్నిక వాయిదా అప్రజాస్వామికం డ్రగ్స్ ముఠా బట్టబయలు లోన్ యాప్ మోసాలపై జాగ్రత్త..! ఆర్గానిక్ ఫార్మర్స్ యాప్ ఉచిత మీమాంస తగునా చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక మేయర్ పీఠం సుప్రీంకోర్టు తీర్పు మరణించిన దూడ తెలంగాణకు శుభవార్త ఎన్నిక వాయిదా అప్రజాస్వామికం డ్రగ్స్ ముఠా బట్టబయలు లోన్ యాప్ మోసాలపై జాగ్రత్త..! ఆర్గానిక్ ఫార్మర్స్ యాప్ ఉచిత మీమాంస తగునా చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక మేయర్ పీఠం సుప్రీంకోర్టు తీర్పు మరణించిన దూడ తెలంగాణకు శుభవార్త ఎన్నిక వాయిదా అప్రజాస్వామికం డ్రగ్స్ ముఠా బట్టబయలు లోన్ యాప్ మోసాలపై జాగ్రత్త..! ఆర్గానిక్ ఫార్మర్స్ యాప్ ఉచిత మీమాంస తగునా చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక మేయర్ పీఠం సుప్రీంకోర్టు తీర్పు మరణించిన దూడ తెలంగాణకు శుభవార్త ఎన్నిక వాయిదా అప్రజాస్వామికం డ్రగ్స్ ముఠా బట్టబయలు లోన్ యాప్ మోసాలపై జాగ్రత్త..! ఆర్గానిక్ ఫార్మర్స్ యాప్

Telangana: భూముల మార్కెట్ విలువ పెంపునకు సర్కార్ కసరత్తు

Anusha
Telangana: భూముల మార్కెట్ విలువ పెంపునకు సర్కార్ కసరత్తు

ముందుగా ఒఆర్ఆర్ లోపలి ప్రాంతంలోనే!

హైదరాబాద్ : తెలంగాణలో భూముల మార్కెట్ విలువను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ కోర్ ఆర్బన్ రీజియన్ పరిధిలో భూముల విలువలను పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులకు సూచించారు. ప్రభుత్వ మార్కెట్ విలువలకు, బహిరంగ మార్కెట్లో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించి ఆదాయం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణలో భూముల మార్కెట్ విలువలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ మేరకు రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలపై సమీక్ష నిర్వహించి అధికారులకు సూచనలు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ కోర్ ఆర్బన్ రీజియన్ (ఔటర్ రింగ్ రోడ్డు లోపల) పరిధిలో భూముల విలువలను పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

కోర్ అర్బన్ పరిధిలోని వ్యవసాయ భూముల ప్రభుత్వ విలువ

ప్రభుత్వ మార్కెట్ విలువలకు, బహిరంగ మార్కెట్లో ఉన్న వాస్తవ విలువలకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటమే పెంపుకు కారణంగా తెలుస్తోంది. కోర్ అర్బన్ పరిధి (Core urban area) లోని వ్యవసాయ భూముల ప్రభుత్వ విలువ ఎకరాకు రూ. 20 లక్షలు ఉండగా.. బహిరంగ మార్కెట్లో అదే భూమి రూ.10 నుంచి 20 కోట్లవరకు అమ్ముడవుతోంది. అదేవిధంగా గజం భూమి ప్రభుత్వ విలువ రూ.2 వేల2,500 ఉండగా, బయట మార్కెట్లో రూ.3050 వేల వరకు పలుకుతోంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. భూముల విలువలను రెండు నుంచి మూడు రెట్లు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అయితే, ఈ పెంపుపై రాబోయే మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Telangana

కలెక్టర్ల నుంచి నివేదికలు వచ్చిన తర్వాతే

ముందుగా కోర్ ఆర్బన్ రీజియన్ లో అమలు చేసి ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దీనిని విస్తరించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. కలెక్టర్ల నుంచి నివేదికలు వచ్చిన తర్వాతే దీనిపై ఒక స్పష్టత వస్తుంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని భూములకు ఖిభూదారి నంబర్లను కేటాయించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వారసత్వ, ఇతర మ్యుటేషన్ల దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. లైసెన్స్డ్ సర్వేయర్లు చేసే భూ సర్వేలను రెగ్యులర్ సర్వేయర్లు తప్పనిసరిగా పరిశీలించాలని ఆదేశించారు. కోర్ ఆర్మన్ పరిధిలో కొత్తగా నిర్మించనున్న 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నమూనాలను సీఎం పరిశీలించారు. ఈ కార్యాలయాల్లో పార్కింగ్, క్యాంటీన్ వంటి మోలిక వసతులు ఉండేలా చూడాలని ఆదేశించారు.

రేవంత్ రెడ్డి ఏ కార్యక్రమంలో పాల్గొన్నారు?

2025 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగరవేశారు . స్వాతంత్ర్య దినోత్సవ ఘనత గురించి ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో ఎవరు పాల్గొన్నారు?

తెలంగాణ మంత్రులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/minister-konda-surekha-779-74-crores-for-the-development-of-temples-in-the-state/telangana/530441/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్న కేటాయింపులు

వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్న కేటాయింపులు

కాగజ్‌నగర్, జహీరాబాద్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశం

కాగజ్‌నగర్, జహీరాబాద్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశం

శివుడికి ప్రసాదం పేరుతో మత్తు పదార్థం పెట్టడంపై సజ్జనార్ ఆగ్రహం

శివుడికి ప్రసాదం పేరుతో మత్తు పదార్థం పెట్టడంపై సజ్జనార్ ఆగ్రహం

ప్రమాద బాధితులను ‘రహ్‌వీర్‌’ కాపాడేనా?

ప్రమాద బాధితులను ‘రహ్‌వీర్‌’ కాపాడేనా?

మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు..

మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు..

ఇబ్రహీంపట్నంలో హైడ్రామా..మున్సిపల్ పీఠంపై వీడని ఉత్కంఠ!

ఇబ్రహీంపట్నంలో హైడ్రామా..మున్సిపల్ పీఠంపై వీడని ఉత్కంఠ!

No image

ఉచిత మీమాంస తగునా!

లక్కీ డ్రాలో కాంగ్రెస్ అభ్యర్థికి దక్కిన మేయర్ పీఠం

లక్కీ డ్రాలో కాంగ్రెస్ అభ్యర్థికి దక్కిన మేయర్ పీఠం

రేవంత్ రెడ్డికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు

రేవంత్ రెడ్డికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు

కేసీఆర్ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

కేసీఆర్ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

పులి దాడిలో మరణించిన దూడ..బిడ్డ వద్దకు అధికారులను తీసుకెళ్లిన తల్లి ఆవు

పులి దాడిలో మరణించిన దూడ..బిడ్డ వద్దకు అధికారులను తీసుకెళ్లిన తల్లి ఆవు

మహిళను చంపిన పూజారికి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు

మహిళను చంపిన పూజారికి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు

📢 For Advertisement Booking: 98481 12870