ముందుగా ఒఆర్ఆర్ లోపలి ప్రాంతంలోనే!
హైదరాబాద్ : తెలంగాణలో భూముల మార్కెట్ విలువను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ కోర్ ఆర్బన్ రీజియన్ పరిధిలో భూముల విలువలను పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులకు సూచించారు. ప్రభుత్వ మార్కెట్ విలువలకు, బహిరంగ మార్కెట్లో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించి ఆదాయం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణలో భూముల మార్కెట్ విలువలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ మేరకు రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలపై సమీక్ష నిర్వహించి అధికారులకు సూచనలు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ కోర్ ఆర్బన్ రీజియన్ (ఔటర్ రింగ్ రోడ్డు లోపల) పరిధిలో భూముల విలువలను పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
కోర్ అర్బన్ పరిధిలోని వ్యవసాయ భూముల ప్రభుత్వ విలువ
ప్రభుత్వ మార్కెట్ విలువలకు, బహిరంగ మార్కెట్లో ఉన్న వాస్తవ విలువలకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటమే పెంపుకు కారణంగా తెలుస్తోంది. కోర్ అర్బన్ పరిధి (Core urban area) లోని వ్యవసాయ భూముల ప్రభుత్వ విలువ ఎకరాకు రూ. 20 లక్షలు ఉండగా.. బహిరంగ మార్కెట్లో అదే భూమి రూ.10 నుంచి 20 కోట్లవరకు అమ్ముడవుతోంది. అదేవిధంగా గజం భూమి ప్రభుత్వ విలువ రూ.2 వేల2,500 ఉండగా, బయట మార్కెట్లో రూ.3050 వేల వరకు పలుకుతోంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. భూముల విలువలను రెండు నుంచి మూడు రెట్లు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అయితే, ఈ పెంపుపై రాబోయే మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

కలెక్టర్ల నుంచి నివేదికలు వచ్చిన తర్వాతే
ముందుగా కోర్ ఆర్బన్ రీజియన్ లో అమలు చేసి ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దీనిని విస్తరించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. కలెక్టర్ల నుంచి నివేదికలు వచ్చిన తర్వాతే దీనిపై ఒక స్పష్టత వస్తుంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని భూములకు ఖిభూదారి నంబర్లను కేటాయించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వారసత్వ, ఇతర మ్యుటేషన్ల దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. లైసెన్స్డ్ సర్వేయర్లు చేసే భూ సర్వేలను రెగ్యులర్ సర్వేయర్లు తప్పనిసరిగా పరిశీలించాలని ఆదేశించారు. కోర్ ఆర్మన్ పరిధిలో కొత్తగా నిర్మించనున్న 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నమూనాలను సీఎం పరిశీలించారు. ఈ కార్యాలయాల్లో పార్కింగ్, క్యాంటీన్ వంటి మోలిక వసతులు ఉండేలా చూడాలని ఆదేశించారు.
రేవంత్ రెడ్డి ఏ కార్యక్రమంలో పాల్గొన్నారు?
2025 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగరవేశారు . స్వాతంత్ర్య దినోత్సవ ఘనత గురించి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో ఎవరు పాల్గొన్నారు?
తెలంగాణ మంత్రులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: