📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

June 2nd : జూన్ 2 న తెలంగాణ ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రారంభిస్తుందంటే..!!

Author Icon By Sudheer
Updated: May 31, 2025 • 2:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జూన్ 2న తెలంగాణ అవిర్భావ దినోత్సవాన్ని (Telangana Formation Day) పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth )నేతృత్వంలోని ప్రభుత్వం ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో పలు పథకాల అమలు తేదీగా ఫిక్స్ చేసింది. ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం, రాజీవ్ యువ వికాసం పథకం తొలి విడత నిధుల మంజూరు, మిగిలిన రైతులకు రైతు భరోసా నిధుల విడుదల, ఉద్యోగుల పెండింగ్ డీఏ ప్రకటన వంటి కీలక అంశాలను అదే రోజున ప్రారంభించనుంది.

పట్టాల పంపిణీ, ఉద్యోగ నియామకాలు

అసైన్డ్ భూములపై సాగు చేస్తున్న పేద రైతులకు పట్టాల మంజూరు చేయడం, గ్రామ పాలన అధికారుల అపాయింట్‌మెంట్‌లు ఇవ్వడం వంటి కార్యక్రమాలూ జూన్ 2నే జరుగనున్నాయి. గ్రామీణ పరిపాలన మెరుగుపర్చే దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో గ్రామ పంచాయతీ ఆఫీసర్ (జీపీవో) పోస్టుల భర్తీకి ముందడుగు వేసింది. దాదాపు 3,500 మందికి రెవెన్యూ శాఖలో రీఅపాయింట్‌మెంట్ లెటర్లు అందించనున్నట్లు సమాచారం. ఇదే సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై కీలక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

జూన్ 3న రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు

జూన్ 3న రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. భూ సమస్యల పరిష్కారం, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన వంటి అంశాలపై ఈ సదస్సుల్లో చర్చించి పరిష్కారాలు అందించనున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా కొన్ని మండలాల్లో ఇప్పటికే విజయవంతంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని అధికారులు తెలిపారు. రైతు భరోసా పథకం కింద మే నెలలో ఇవ్వాల్సిన నిధులు జూన్ 3న విడుదల చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలతో పండగ వాతావరణం నెలకొననుంది.

Read Also : Rohit Sharma: ఐపిఎల్ లో చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ

cm revanth Google News in Telugu June 2nd Telangana Formation Day

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.