📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

యాసంగి పంటలపై తెలంగాణ సర్కార్‌ కీలక ఆదేశాలు !

Author Icon By sumalatha chinthakayala
Updated: March 4, 2025 • 7:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: యాసంగి పంటలపై తెలంగాణ సర్కార్‌ కీలక ఆదేశాలు ఇచ్చింది. యాసంగి సీజన్ పంట సాగు, రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు చేపట్టిన కార్యక్రమాలపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా యాసంగి పంటలకు నీటి నిర్వహణ సమర్ధవంతంగా జరిగేలా కలెక్టర్లు చాలా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు శాంతి కుమారి. గతేడాదితో పోలిస్తే నికర సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ నీటి వనరులలో నీటి లభ్యత చాలా సౌకర్యంగా ఉందని, యాసంగి సీజన్‌ను బాగా చూసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు.

రైతులకు అవగాహన

రాబోయే పది రోజులలో విద్యుత్, నీటి సరఫరాను జాగ్రత్తగా సమన్వయం చేయాలని, విద్యుత్ సరఫరాలో ప్రస్తుత పరిస్థితి సౌకర్యవంతంగా ఉందన్న సీఎస్ జిల్లాలో స్థానిక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు మండల స్థాయి బృందాలను ఏర్పాటు చేయాలని, క్షేత్ర స్థాయిలో సమర్ధవంతమైన నిర్వహణ ఉండే విధంగా జిల్లా కలెక్టర్లు పర్యేవేక్షించాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నీటి నిల్వలు, విద్యుత్ సరఫరా తగినంత పరిమాణంలో ఉన్నాయని రైతులకు అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు.

21 చోట్ల కొనుగోలు కేంద్రాలు

కాగా, రాష్ట్రంలో రైతు పండించిన పంటలు కేంద్రం కొనుగోలు చేయకపోయినా సీఎం రేవంత్​రెడ్డి ఆదేశాల మేరకు మద్దతు ధరకు కొనుగోలు చేసినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఇప్పటికే ప్రొద్దు తిరుగుడు సేకరణ మార్క్​ఫెడ్​ ఆధ్వర్యంలో 21 చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఐదు చోట్ల ప్రారంభించామని తెలిపింది. పంట కోతల ప్రకారం మిగతా సెంటర్ల కూడా ప్రారంభిస్తామని, పొద్దు తిరుగుడు పండించిన రైతులు మార్కెట్​ ప్రమాణాలకు తగ్గట్టుగా కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చి మద్దతు దర పొందాలని కోరింది. ప్రతిపక్ష పార్టీ నేతలపై పొద్దు తిరుగుడు కోనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని పేర్కొనడం సరికాదని తెలిపింది.

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu telangana government Telugu News online Yasangi crops

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.