తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు శుభవార్త తీసుకొచ్చింది. చాలా కాలంగా నిలిచిపోయిన టీచర్ల ప్రమోషన్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత ఫైల్పై సంతకం చేసి, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభానికి ఆమోదం తెలిపారు. దీని ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
SGTలు, స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు
ఇప్పటికే డిపార్ట్మెంట్ వర్గాల సమాచారం ప్రకారం, సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT) మరియు స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతుల ప్రక్రియను చేపట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. వచ్చే రెండు రోజుల్లో ప్రమోషన్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. దీనివల్ల ఖాళీగా ఉన్న హెడ్మాస్టర్, స్కూల్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి దారి వెలుస్తుంది. గత ప్రభుత్వం కాలంలో ఆగిపోయిన ఈ ప్రక్రియ పునఃప్రారంభం కావడం ఉపాధ్యాయ వర్గాల్లో హర్షాతిరేకాలను కలిగిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా పదోన్నతులపై ప్రక్రియ వేగవంతం
తెలంగాణ విద్యాశాఖ ప్రస్తుతం ఖాళీలను గుర్తించి, జిల్లా స్థాయిలో లిస్ట్ తయారుచేసే పనిలో ఉంది. జిల్లాల వారీగా వివరాలు సమీక్షించిన అనంతరం పూర్తి షెడ్యూల్ ప్రకటించనున్నారు. పదోన్నతుల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు ఇది బంగారు అవకాశంగా నిలవనుంది. పదోన్నతులు లభిస్తే ఉపాధ్యాయుల సేవా సత్కారమే కాక, విద్యా ప్రమాణాలు మెరుగవ్వడానికి కూడా ఇది దోహదం చేస్తుంది.
Read Also : BRS Merge with BJP : సీఎం రమేష్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం