హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు, ఆటో డ్రైవర్ల ఆర్థిక భారానికి చెక్ పెట్టేలా తెలంగాణ ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో వినూత్నమైన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CUR) పరిధిలో నడుస్తున్న సుమారు 1.25 లక్షల ఆటోలను దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ‘రెట్రో ఫిటింగ్’ (Retro-fitting) అనే పద్ధతిని ప్రవేశపెట్టింది, అంటే ప్రస్తుతం ఉన్న పెట్రోల్, డీజిల్ ఇంజిన్లను తొలగించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ కిట్లను అమరుస్తారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్టు కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా రూ. 200 కోట్లను కేటాయించారు. దీనివల్ల ఆటో డ్రైవర్లకు రోజువారీ ఇంధన ఖర్చులు (పెట్రోల్/డీజిల్) పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా, ఇంజిన్ మెయింటెనెన్స్ సమస్యలు కూడా తప్పుతాయి. డ్రైవర్లపై ఆర్థిక భారం పడకుండా ఈ మార్పిడి ఖర్చును ప్రభుత్వమే భరించనుండటం గమనార్హం.
Read Also ; Tamil Nadu Elections : తమిళనాడులో AIADMKదే పైచేయి?
ప్రస్తుతం మార్కెట్లో రెండు రకాల ఎలక్ట్రిక్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. స్వాపబుల్ బ్యాటరీ (Battery Swapping) సిస్టమ్ కోసం రూ. 1.20 లక్షలు, ఫిక్స్డ్ బ్యాటరీ సిస్టమ్ కోసం రూ. 2 లక్షల వరకు ఖర్చవుతుంది. నగరంలోని అన్ని ఆటోలను మార్చాలంటే దాదాపు రూ. 1,500 కోట్ల నుండి రూ. 2,500 కోట్లు అవసరమవుతాయని అంచనా. అయితే, ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన రూ. 200 కోట్లతో ఈ ప్రక్రియ పూర్తి కావడానికి సుమారు ఏడేళ్లు పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, కాలుష్యాన్ని ఎక్కువగా విడుదల చేసే పాత పెట్రోల్, డీజిల్ ఆటోలపై ముందుగా దృష్టి సారిస్తే, ఐదేళ్లలోనే లక్ష్యాన్ని చేరుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సీఎన్జీ (CNG), ఎల్పీజీ (LPG) ఆటోలను మినహాయించి ప్రాధాన్యత క్రమంలో ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా నగరం త్వరగా ‘గ్రీన్ సిటీ’గా మారే అవకాశం ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :