తెలంగాణ(Telangana) రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్-3 కేటగిరీలోకి వచ్చే లబ్ధిదారుల బిల్లులు కొంతకాలంగా నిలిచిపోవడంతో గృహ నిర్మాణ పనులు మందగించాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్లు సమర్పించిన నివేదికల ఆధారంగా అర్హులైన వారి పెండింగ్ చెల్లింపుల కోసం రూ.12.17 కోట్లను విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి. గౌతం తెలిపారు.
Read Also: Land : భూమి, కౌలు సంస్కరణలు అవసరం ల్యాండ్

ఎల్-3 కేటగిరీ పెండింగ్ బిల్లులకు రూ.12.17 కోట్ల నిధుల విడుదల
ఈ నిధులతో అద్దె ఇళ్లలో ఉంటూ(Telangana) స్వంత గృహాల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు మాత్రమే కాకుండా, పాత ఇందిరమ్మ పథకంలో బేస్మెంట్ దశ వరకే పనులు పూర్తిచేసి ఆర్థిక సహాయం అందని వారి బకాయిలను కూడా చెల్లించనున్నారు. ఈ నిర్ణయంతో గృహ నిర్మాణ పనులు మళ్లీ వేగం పుంజుకుంటాయని, లబ్ధిదారులకు ఆర్థిక ఊరట లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: