రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నగదు రహిత చికిత్స పథకాన్ని తెలంగాణలో(Telangana) అమలు చేయడానికి ఆరోగ్యశ్రీ ట్రస్టు చర్యలు చేపడుతోంది. ఈ పథకం కింద బాధితులకు గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా వైద్య సేవలు అందించనున్నారు.
Read Also: Computer Didi Scheme: డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు
కార్డులు లేకున్నా వర్తించే పథకం
ఆరోగ్యశ్రీ లేదా ఆయుష్మాన్ భారత్ కార్డులు లేని వారికి కూడా ఈ సౌకర్యం వర్తించనుండటం ఈ పథకంలోని ప్రధాన విశేషం. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి చేరిన బాధితులకు ఎలాంటి ఆర్థిక అడ్డంకులు లేకుండా చికిత్స అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు.
ప్రమాద ప్రాంతాల్లో నెట్వర్క్ ఆసుపత్రులు
ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు(Telangana) సంభవించే ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను గుర్తించి, వాటిని ఈ పథకం నెట్వర్క్లోకి తీసుకురానున్నారు. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో బాధితులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే అవకాశం మెరుగవుతుందని అధికారులు భావిస్తున్నారు.
మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ నుంచి నిధులు
ఈ పథకానికి కావాల్సిన నిధులను మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ నుంచి విడుదల చేయనున్నారు. ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఈ పథకం ప్రయోగాత్మకంగా అమలులోకి వచ్చి, వేలాది మంది ప్రమాద బాధితులకు ఉపయోగపడినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ పథకం వర్తించాలంటే ప్రమాదం జరిగిన 24 గంటల లోపే ఈడార్ (eDAR) నమోదు చేయడం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. ఈ నిబంధన పాటిస్తేనే నగదు రహిత చికిత్స సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: