Latest news: Telangana: లక్కీడ్రా పేరుతో దోపిడీ

Read Time:  1 min
Telangana
Telangana
FONT SIZE
GET APP

మంచి విత్తుల్లో నాసిరకం మిక్సింగ్

హైదరాబాద్ : రాష్ట్రంలో యాసంగి సీజను ప్రారంభమైన నేపధ్యంలో తెలంగాణలో పలు విత్తన సంస్థలు రైతులను నిలువునా ముంచేస్తున్నాయి. అమాయకులైన రైతులకు ఎరవేసి నకిలీ, నాసి రకం విత్తనాలు అంటగడుతున్నాయి. ఏజెన్సీలే లక్ష్యంగా విత్తన కంపెనీలు మోసాలకు తెగిస్తున్నాయి. అమాయక రైతులను(Telangana) లక్కీడ్రాల పేరుతో కొన్ని సంస్థలకు చెందిన ప్రతినిధులు వంచనకు గురి చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బుకింగ్ చేయడంతోపాటు, బహుమతులు అంటూ బురిడీ కొట్టిస్తున్నారు. అందమైన బ్రోచర్లు, ఆకట్టుకునే విధంగా కరపత్రాలు చూపించి నకిలీ, నాసిరకం విత్తనాలును అంటగడుతున్నారు. రాష్ట్రంలో ఈ యాసంగి సీజనులో 68.67 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ(Department of Agriculture) అంచనా వేయగా, ఇందులో ప్రధాన పంట వరి అత్యధికంగా 51.48 లక్షల ఎకరాల్లో నాట్లు పడతాయని అంచనా వేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మార్కెట్లలో నకిలీలు, నాసికరం విత్తనాలు ప్రవేశించాయి.

Read also: సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం

Telangana
Telangana: లక్కీడ్రా పేరుతో దోపిడీ

నకిలీ విత్తనాలు అంటగడుతున్న సంస్థలు

రాష్ట్రంలోని (Telangana)పలు ప్రాంతాల్లో విత్తన కంపెనీల ప్రతినిధులు రైతులను నమ్మించి బుట్టలో వేసుకుంటున్నారు. ఆషామాషీ కాదంటూ బంపర్ ఆఫ్ ప్రకటిస్తూ బోల్తా కొట్టిస్తున్నారు. కేవలం తమ కంపెనీ విత్తన ప్యాకెట్లు మూడు కొంటే చాలు జత ఎద్దులు, లేదంటే నగదు, ఇంకా రకరకాల గిఫ్టు ప్యాక్లంటూ గ్రామాల్లో ఊదరగొడుతున్నారు. గతంలో కూడా కొన్ని కంపెనీలు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం, గిఫ్టుల పేరుతో దాదాపు వేల మంది రైతుల వద్ద నుండి ఒక్కొక్కరి వద్ద రూ.200 నుండి రూ.400 వరకూ లక్కీ డ్రా పేరిట వసూలు చేశారు. గిఫ్ట్ మాత్రం ఎవరికి రాలేదు సరికదా, ఇచ్చిన వరి, మిరప తదితర విత్తనాలు సైతం కాత, పూత లేక పెట్టుబడి సైతం నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అదే విధంగా మూడు విత్తన కంపెనీలకు చెందిన ప్రతినిధులు విత్తనాలు, గిఫ్ట్ల పేరుతో మళ్లీ వసూలు చేస్తున్నట్లు పలువురు బహిరంగంగా చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.