📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana: ఉమ్మడి పుల్కల్ మండలంలో టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం

Author Icon By Aanusha
Updated: March 13, 2026 • 8:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana: ఉమ్మడి పుల్కల్ మండలంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు విద్యా శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 14వ తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు ఉమ్మడి పుల్కల్ మండలంలో 881 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మండలంలోని ఆరు జిల్లా ప్రజా పరిషతు ఉన్నత పాఠశాలతో పాటు కస్తూర్బా గాంధీ పాఠశాల, తెలంగాణ ఆదర్శ, సింగూరు గురుకుల పాఠశాలల్లో 451 విద్యార్థులు, చౌటకూర్ మండలంలోని నాలుగు జిల్లా ప్రజా పరిషతు ఉన్నత పాఠశాలల్లో 430 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు మౌలిక సౌకర్యాలు కల్పించారు. ఉమ్మడి పుల్కల్ మండలంలో మొత్తం 881 మంది విద్యార్థినీ, విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు.

Read Also: ‘Mega Farmers’ Fair 2026′ : తెలంగాణ వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవం

Telangana: Everything is ready for the Tent exams in the joint Pulkal mandal

పరీక్షా కేంద్రాల కేటాయింపు

పుల్కల్ మండలంలో సింగూరు గురుకుల పాఠశాల, తెలంగాణ ఆదర్శ పాఠశాలలు పరీక్షా కేం ద్రాలుగా ఏర్పాటు చేయగా, చౌటకూర్ మండలంలో చౌటకూర్, శివపేట జిల్లా ప్రజా పరిషతు ఉన్నత పాఠశాలలను పదవ తరగతి పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. పుల్కల్లోని పరీక్షా కేంద్రాలకు 28 మంది ఇన్విజిలేటర్లు, ఇద్దరు డిపార్ట్మెంటల్ అధికారులు, చౌటకూర్ మండలంలోని రెండు పరీక్షా కేంద్రాలకు 31 మంది ఇన్విజిలేటర్లును నియమించినట్లు ఎంఈవోలు శంకర్, అనురాధలు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Choutkur School Pulkal Mandal SSC exams Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.