తెలంగాణలో(Telangana Education) ఉన్నత విద్యలో కీలక మార్పులు చేపట్టనున్నట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి వెల్లడించారు. కాలం చెల్లిన పాఠ్యాంశాలను పూర్తిగా తొలగించి, ప్రస్తుత మార్కెట్ అవసరాలకు సరిపోయే సబ్జెక్టులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
Read Also: Telangana Police: పోలీసు సేవలకు గుర్తింపు.. న్యూ ఇయర్ సందర్భంగా పతకాలు
విద్యార్థుల్లో ఇంగ్లిష్పై ఉన్న భయాన్ని తగ్గించే లక్ష్యంతో సులభమైన, అర్థమయ్యే విధానంలో కొత్త ఇంగ్లిష్ పాఠ్యాంశాలను రూపొందించినట్లు చెప్పారు. అదే విధంగా సంప్రదాయ డిగ్రీ కోర్సులను ఆధునిక టెక్నాలజీతో అనుసంధానం చేస్తూ, ప్రాక్టికల్ నైపుణ్యాలు పెంపొందించేలా మార్పులు చేస్తున్నామని వివరించారు.
ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్సులకే ప్రాధాన్యం ఇస్తామని, మార్కెట్లో డిమాండ్(Telangana Education) ఉన్న విభాగాల్లో సీట్ల సంఖ్యను పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని బాలకిష్టారెడ్డి స్పష్టం చేశారు. ఈ మార్పులతో విద్యార్థులు చదువుతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా పొందగలుగుతారని ఆయన అభిప్రాయపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: