📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Telangana: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో కాలేజీలు తెరిచేది లేదు

Author Icon By Sushmitha
Updated: October 1, 2025 • 11:28 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో(Telangana) ప్రైవేట్ కాలేజీల(Private colleges) యాజమాన్యాలు, ప్రభుత్వానికి మధ్య ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల వివాదం మరోసారి ముదిరింది. గతంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆరోపిస్తూ, దసరా సెలవుల అనంతరం ఈ నెల 6వ తేదీ నుంచి కాలేజీలను నిరవధికంగా మూసివేయాలని యాజమాన్యాలు నిర్ణయించాయి. దీంతో రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల(students) భవిష్యత్తుపై మళ్లీ ఆందోళన మొదలైంది.

Read Also: Sunteck Realty: సన్‌టెక్ రియాల్టీ: అల్ట్రా లగ్జరీ ఫ్లాట్‌లు రూ. 100–500 కోట్లలో

ప్రభుత్వ హామీ, నిధులు విడుదల చేయకపోవడం

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ కాలేజీలు గత నెల 15న బంద్‌కు పిలుపునిచ్చాయి. అప్పుడు స్పందించిన ప్రభుత్వం, యాజమాన్యాలతో చర్చలు జరిపింది. దసరాకు ముందు రూ.600 కోట్లు, దీపావళి తర్వాత మరో రూ.600 కోట్లు విడుదల చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ప్రభుత్వ హామీతో యాజమాన్యాలు తమ ఆందోళనను తాత్కాలికంగా విరమించుకున్నాయి. అయితే, ప్రభుత్వం హామీ ఇచ్చి రెండు వారాలు గడిచినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి.

నిధులు విడుదల అసాధ్యం: ప్రభుత్వ వైఖరి

ఈ విషయమై ఇటీవల కాలేజీల ప్రతినిధులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాతో సమావేశమయ్యారు. బకాయిల గురించి ప్రస్తావించగా, ఇప్పుడు నిధులు విడుదల చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసినట్టు సమాచారం. ప్రభుత్వ వైఖరితో తీవ్ర అసంతృప్తికి గురైన యాజమాన్యాలు మళ్లీ ఆందోళన బాట పట్టాయి.

ఫతి అత్యవసర సమావేశం

దీనిపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసేందుకు ‘ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్(Federation of Associations) ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఫతి)’ ప్రతినిధులు బుధవారం హైదరాబాద్‌లో అత్యవసరంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో నిరవధిక బంద్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదే జరిగితే, దసరా సెలవుల తర్వాత కళాశాలలు తెరుచుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.

కాలేజీలు ఎప్పటి నుంచి నిరవధిక బంద్‌కు సిద్ధమవుతున్నాయి?

దసరా సెలవుల అనంతరం ఈ నెల 6వ తేదీ నుంచి నిరవధిక బంద్‌కు సిద్ధమవుతున్నాయి.

ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ ఏమిటి?

దసరాకు ముందు రూ.600 కోట్లు, దీపావళి తర్వాత మరో రూ.600 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

College Bandh fee reimbursement Google News in Telugu Government Dispute. higher education Latest News in Telugu private colleges Sandeep Kumar Sultania Telangana Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.