TG 10th Class Exams Cancel: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యా విధానంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. తాజాగా మీడియాతో జరిగిన చిట్ చాట్లో భాగంగా, విద్యార్థులపై చదువుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
Read Also: Bandi Sanjay: కొండగట్టులో బండి సంజయ్ ప్రత్యేక పూజలు
TG 10th Class Exams Cancel: పదవ తరగతి బోర్డు పరీక్షల రద్దు దిశగా అడుగులు
ఈ విద్యా సంస్కరణల్లో అత్యంత కీలకమైన అంశం పదవ తరగతి (SSC) పరీక్షల రద్దు. ప్రస్తుతం కొనసాగుతున్న సాంప్రదాయ బోర్డు పరీక్షల విధానాన్ని స్వస్తి పలికే దిశగా తమ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. విద్యార్థుల ప్రతిభను కేవలం ఒక్క పరీక్షతో అంచనా వేయడం కంటే, నిరంతర మూల్యాంకన పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడమే లక్ష్యం
ప్రస్తుత పరీక్షా విధానం విద్యార్థులపై తీవ్రమైన మానసిక ఒత్తిడిని పెంచుతోందని, ఇది వారి సృజనాత్మకతను దెబ్బతీస్తోందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ ఒత్తిడిని తగ్గించి, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అందించడమే సరికొత్త విద్యా విధానం యొక్క ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో గ్రేడింగ్ లేదా ఇతర ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసే అవకాశం ఉంది.
ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలకు అనుగుణంగా తెలంగాణ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడం లక్ష్యం
నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధమైన విద్యా విధానాన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విధానంలో నిరంతర మూల్యాంకనానికి ప్రాధాన్యత ఇస్తామని, ఒక్కసారి పరీక్షలు పెట్టే బదులు, సంవత్సరమంతా విద్యార్థుల ప్రతిభను అంచనా వేయడానికి కృషి చేస్తామని అన్నారు.ఈ కొత్త విధానంలో విద్యార్థులు ప్రాక్టికల్ నాలెడ్జ్ ,
నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి దృష్టి సారించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలిపారు. ఈ ప్రయత్నం ద్వారా ఉపాధ్యాయుల పాత్రను మరింత బలోపేతం చేసి, బోధనలో మరింత నాణ్యతను పెంచే చర్యలు చేపడతామన్నారు. ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలకు అనుగుణంగా తెలంగాణ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడం లక్ష్యంగా పనిచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
పూర్తిస్థాయి అధ్యయనం చేసిన తర్వాత తుది నిర్ణయం
అయితే ఈ ప్రతిపాదన పైన అందరి అభిప్రాయాలు తీసుకుంటామని, ముఖ్యంగా తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యా నిపుణుల అభిప్రాయాలను తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పూర్తిస్థాయి అధ్యయనం చేసిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఈ మార్పులు అమలులోకి వస్తే విద్యారంగంలో చాలా విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: