తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన ఇన్ఛార్జీ మంత్రులను ఆయన అభినందించినట్లు తెలుస్తోంది. బాధ్యతలు తీసుకున్న ప్రాంతాల్లో సమర్థవంతంగా పని చేసి మంచి ఫలితాలు సాధించారని కితాబు ఇచ్చారు.
Read Also: Telangana: కాంగ్రెస్ ఖాతాలోకి వడ్డేపల్లి మున్సిపాలిటీ
మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
ఎక్స్ అఫీషియో ఓట్లు, హంగ్ వచ్చిన మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులు దక్కించుకునే అంశాలపై మంత్రులతో చర్చించారు. ఎక్స్ అఫీషియో ఓట్లతో నిజామాబాద్ను కైవసం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే కొత్తగూడెంలో ఇండిపెండెంట్స్ పై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే పని చేయాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: