Telangana: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి (SSC) వార్షిక పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,28,239 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల సజావుగా నిర్వహించేందుకు అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు.ప్రతిరోజూ ఉదయం 09:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అయితే, ఫస్ట్ లాంగ్వేజ్ (కాంపోజిట్ కోర్సు), సైన్స్ పేపర్లకు మాత్రం సమయ వేళల్లో స్వల్ప మార్పులు ఉంటాయి.
Read Also: TG Government: పంచాయతీ నిధులపై మంత్రి సీతక్క ఆదేశాలు
హాల్ టికెట్ల డౌన్లోడ్ ఇలా
అయితే ఈ పరీక్షలకు సంబంధించిన హాట్ టికెన్లను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. విద్యార్థుల హాల్ టికెట్లను ఇప్పటికే స్పీడ్ పోస్ట్ ద్వారా సంబంధిత పాఠశాలలకు పంపడం జరిగింది. అయితే విద్యార్థులు నేరుగా వెబ్సైట్ నుండి కూడా వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం విద్యార్థులు www.bse.telangana.gov.in సందర్శించవచ్చు. ఈ వెబ్సైట్లోనే టెన్త్ క్లాస్ హాల్ టికెట్స్ అందుబాటులో ఉన్నాయి.
వాట్సాప్లో హాల్ టికెట్స్
అయితే ఈసారి వినూత్నంగా వాట్సాప్ ద్వారా కూడా హాల్ టికెట్లు పొందే సదుపాయాన్ని కల్పించారు అధికారులు. 8096958096 నంబర్కు “Hi” అని మెసేజ్ పంపి, ఆపై “SSC Hall Ticket March-2026” అని టైప్ చేయడం ద్వారా మీరు నేరుగా మీ మొబైల్లోనే హాల్ టికెట్ పొందవచ్చు. పరీక్షల నిర్వహణలో విద్యార్థులకు లేదా తల్లిదండ్రులకు ఎలాంటి సందేహాలు ఉన్నా, సమస్యలు ఎదురైనా సంప్రదించడానికి హైదరాబాద్లోని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయంలో 24/7 కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. సహాయం కోసం 040-23230942 నంబర్ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని, హాల్ టికెట్తో పాటు అవసరమైన సామాగ్రిని వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షల నేపథ్యంలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు డైరెక్టర్ పి.వి. శ్రీహరి స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: