हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telangana: మరింత ఆలస్యం కానున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ

Sharanya
Telangana: మరింత ఆలస్యం కానున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తీవ్రంగా ఎదురుచూస్తున్న సమయంలో, మరోసారి ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇప్పటి వరకు మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేయకపోవడం, పార్టీ నాయకత్వ స్థాయిలో చర్చలు ఇంకా పూర్తికాకపోవడం గమనార్హం.

ఖర్గే ఆరోగ్య కారణాలతో సమావేశానికి ఆటంకం

మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకోవాల్సిన ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రస్తుతం ప్రకృతి చికిత్స లో ఉన్న ఖర్గే షెడ్యూల్ ప్రకారం సోమవారం ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. అయితే వైద్యుల సూచలన మేరకు ఆయన చికిత్స్ మరో రెండు రోజులు కొనసాగనున్నట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 30 వ తేదిన ఖర్గే ఢిల్లీ చేరుకోనున్నారు. దీంతో ఈ సమావేశం ఈ నెల 30 కి మీటింగ్ ను వాయిదా వేశారు. దీంతో రెండు రోజులు ఎదురు చూపుల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు వెనుదిరిగారు. సోమవారం అక్బర్ రోడ్ లోని జన్ పథ్ 10 లో రాహుల్ గాంధీతో పార్టీ వ్యవహారాల జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ లు వేరు వేరుగా భేటి అయ్యారు. సాయంత్రం 5:15 కు ప్రారంభమైన ఈ సమావేశం గంట పాటు సాగింది.

పీసీసీ చీఫ్ భేటీలు – బీసీలకు ప్రాధాన్యత కోరిన విజ్ఞప్తి

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో వేర్వేరు సమావేశాలు జరిపారు. సాధ్యమైనంత త్వరగా క్యాబినేట్ విస్తరణ చేపట్టాలని, అందులో బీసీలకు రెండు పదవులు ఇవ్వాలని మహేశ్ కుమార్ గౌడ్ రాహుల్ ని కోరినట్లు తెలిసింది. ప్రస్తుతం బీసీ కుల గణన తో దేశ వ్యాప్తంగా వెళ్తోన్న నేపథ్యంలో ఈ నిర్ణయం పార్టీకి మరింత కలిసి వస్తుందని వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలిపినట్లు సమాచారం. అలాగే కార్యవర్గంలోనూ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఇతర పదవుల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. ఐదు బెర్త్ లకు సంబంధించి ఏడుగురి పేర్లను ప్రియార్టీలో ఉన్నట్లు తెలిపారు. అలాగే నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, తక్కువ సంఖ్యతో కూడిన పీసీసీ కార్యవర్గ లిస్ట్ ను సమర్పించారు. వీటిపై కేసీ వేణుగోపాల్ బ్రీఫ్ చేయగా అనంతరం పీసీసీ చీఫ్ కుటుంబ సమేతంగా రాహుల్ గాంధీని కలిసారు. కుటుంబ వారితో కాసేపు ముచ్చటించిన రాహుల్, తర్వాత మహేశ్ కుమార్ గౌడ్ తో ప్రత్యేకంగా భేటి అయ్యారు.

సీఎం రేవంత్‌కు అపాయింట్మెంట్ లేకపోవడంపై రాజకీయ చర్చ

ఈసారి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చినప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డికి ఇవ్వకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తమ రిక్వెస్ట్ పై రాహుల్ సానుకూలంగా స్పందించారని త్వరగా చేస్తామని హామీ ఇచ్చారన్నారు. మర్యాద పూర్వకంగా కుటుంబ సమేతంగా రాహుల్ గాంధీని కలిసినట్లు మహేశ్ కుమార్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అంశాలను రాహుల్ గాంధీకి వివరించినట్లు తెలిపారు. తెలంగాణ క్యాబినెట్‌లో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని అధిష్టానాన్ని కోరామన్నారు. త్వరగా క్యాబినేట్ కూర్పు చేయాలని రాహుల్ ని విజ్ఞప్తి చేశామని త్వరలో ఉంటుందని ఆశిస్తున్నామన్నారు. ఒకటి, రెండు రోజుల్లో పీసీసీ కార్యవర్గం ప్రకటన ఉంటుందని వెళ్లడించారు.

సీఎంతో పీసీసీ సమావేశం

మంత్రివర్గంలో ఇప్పటికీ ఖాళీగా ఉన్న పదవులు, అనేక శాఖలు పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం పరిపాలన పరంగా కూడా సమస్యలను కలిగిస్తోంది. రాహుల్ తో భేటి అనంతరం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నేరుగా తుగ్లక్ రోడ్ 23 లోని సీఎం అధికారిక నివాసానికి చేరుకున్నారు. దాదాపు అరగంట పాటు సీఎంతో చర్చించారు. రాహుల్ తో భేటి సందర్భంగా జరిగిన అంశాలను బ్రీఫ్ చేశారు. ప్రస్తుతం ఖర్గే అందుబాటులో లేనందున ఈ నెల 30 కి మీటింగ్ ను వాయిదా వేసిన విషయాన్ని వివరించారు.

Read also: Rajiv Yuva Vikasam Scheme : రేపటితో ఎంపిక పూర్తి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హోంగార్డు

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హోంగార్డు

రోడ్డు భద్రతపై విద్యార్థులకు ఎస్పీ డి.జానకి దిశానిర్దేశం!

రోడ్డు భద్రతపై విద్యార్థులకు ఎస్పీ డి.జానకి దిశానిర్దేశం!

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణమే

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణమే

పటాన్‌చెరులో మూడు బస్సులు ఒకదానికొకటి ఢీ

పటాన్‌చెరులో మూడు బస్సులు ఒకదానికొకటి ఢీ

కవిత కు ఇక తిరుగులేదా ?

కవిత కు ఇక తిరుగులేదా ?

సదాశివపేట బైపాస్ వద్ద ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
0:56

సదాశివపేట బైపాస్ వద్ద ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

ఫార్ములా-ఈ రేసు కేసులో బిగిస్తున్న ఉచ్చు.. అర్వింద్ కుమార్‌పై వేటు?

ఫార్ములా-ఈ రేసు కేసులో బిగిస్తున్న ఉచ్చు.. అర్వింద్ కుమార్‌పై వేటు?

పరీక్షా కేంద్రంలో విద్యార్థినికి గర్భస్రావం

పరీక్షా కేంద్రంలో విద్యార్థినికి గర్భస్రావం

జిహెచ్ఎంసీ స్థానంలో కోర్ అర్బన్ చట్టం

జిహెచ్ఎంసీ స్థానంలో కోర్ అర్బన్ చట్టం

ఇంట్లోనే మహిళా కానిస్టేబుల్ బలవన్మరణం

ఇంట్లోనే మహిళా కానిస్టేబుల్ బలవన్మరణం

కొందరి ‘పాపాలు’ ఎందరికో శాపాలు!

కొందరి ‘పాపాలు’ ఎందరికో శాపాలు!

అనుభవంలేని టీచర్లతో విద్యాకమిషన్ సాధించేదేమిటి?

అనుభవంలేని టీచర్లతో విద్యాకమిషన్ సాధించేదేమిటి?

📢 For Advertisement Booking: 98481 12870