Telangana Budget Highlights: తెలంగాణలో ఇంటర్, ఐటీఐ, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కొత్త పథకం ప్రకటించారు. ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం గవర్నమెంట్ స్కూళ్లలో ఈ పథకం అమలవుతుండగా.. ఇక నుంచి కాలేజీల్లోనూ అమలు చేయనున్నట్లు వెల్లడించారు. దాంతో పాటుగా.. ఐటీఐ, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2 వేల ఉపకారవేతం ఇవ్వనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించారు.
Read Also: Telangana Budget updates : జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం

విద్యారంగానికి భారీగా నిధుల కేటాయింపు
మెుత్తం రూ.3,24,234 లక్షల కోట్లతో తెలంగాణ వార్షిక బడ్జెట్ను భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,34,406 లక్షల కోట్లు కాగా.. మూలదన వ్యయం రూ. 47, 267 వేల కోట్లు. కీలక శాఖలకు అధిక నిధులను కేటాయించారు. బడ్జెట్లో విద్యాశాఖకు ప్రాధాన్యం ఇస్తూ 26,674 కోట్లు కేటాయించారు. సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత బడ్జెట్ల కంటే ఈసారి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నిధుల కేటాయింపులు చేసినట్లు ఆయన తెలిపారు.
వ్యవసాయం, విద్య, వైద్యంతో పాటు సామాజిక భద్రతకు ఈ బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యత లభించిందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నామని రెండేళ్ల కాలంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు. దేశంలోనే ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. రాష్ట్రాభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని.. దేశంలోనే తెలంగాణను నంబర్వన్గా నిలుపుతామని అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: