Telangana Budget: ఈసారి బడ్జెట్‌లో కొత్త పథకాలు..ప్రజలకు భారీ ఊరట

Read Time:  1 min
ఈసారి బడ్జెట్‌లో కొత్త పథకాలు..ప్రజలకు ఊరట
ఈసారి బడ్జెట్‌లో కొత్త పథకాలు..ప్రజలకు ఊరట
FONT SIZE
GET APP

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.ఈ రోజు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లూ భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే కార్యక్రమం మధ్యాహ్నం 12.00 గంటలకు ఉభయ సభలతో ప్రారంభం కానుంది. ఈ బడ్జెట్‌ను అభిజిత్ ముహూర్తంలో సభలో మల్లు ప్రవేశపెట్టనున్నారు. దీని కన్నా ముందు ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం లభిస్తుంది. విశేషం ఏమిటంటే.. ఈసారి ఐదు నుంచి ఆరు కొత్త పథకాలు ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. గతేడాది 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రూ.3,40,000 కోట్లతో ప్రవేశపెట్టబడినప్పటికీ, ఈ ఏడాది బడ్జెట్ సుమారు రూ.3,36,000 కోట్ల అంచనాతో రూపుదిద్దినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆదాయంలో పెరుగుదలతో బడ్జెట్ అంచనాలు 10 శాతం వరకూ పెరుగుతాయని అంచనా.

Read Also: Telangana Assembly Budget 2026 -27: నేడే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్న భట్టి

Telangana Budget: New schemes in the budget this time.. relief for the people
Telangana Budget: New schemes in the budget this time.. relief for the people

ఈ రంగాలకే అధిక కేటాయింపులు..

జీఎస్టీ శ్లాబులు మారినా రాష్ట్ర ఆదాయంపై పెద్ద ప్రభావం పడలేదు. ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రధానంగా విద్య, వైద్యం, సంక్షేమం, నీటి పారుదల రంగాలకు పెద్ద ప్రాధాన్యం ఇవ్వబడనుంది. ముఖ్యంగా పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధికి భారీ నిధులు కేటాయించబడతాయి. ఆర్థిక పరిశీలనల ప్రకారం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, తమ్ముడిహట్టి బ్యారేజ్, మూసి రివర్ ఫ్రంట్, రీజినల్ రింగ్ రోడ్, మెట్రో రైల్ వంటి పెద్ద ప్రాజెక్టులకు బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. తెలంగాణ బడ్జెట్..రైతుల కోసం ఎంతంటే.. వీటితో పాటు, రాష్ట్రంలో విద్యారంగానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత, రైతుల సంక్షేమ పథకాల విస్తరణకు నిధులు కేటాయించబడతాయి. ముఖ్యంగా కొత్త బడ్జెట్ పథకాల ద్వారా పేద, మధ్యతరగతి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి గట్టి దోహదం చేయడం లక్ష్యం. పెరిగిన రాష్ట్ర ఆదాయంతో.. బడ్జెట్ అంచనాలు 10 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. ఇక జీఎస్టీ శ్లాబులు మారినా కానీ.. రాష్ట్ర ఆదాయానికి పెద్దగా ఇబ్బంది కలగలేదని వార్తలు వస్తున్నాయి. శాసనమండలిలో ఈ సారి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టే వ్యవహారం ప్రత్యేకంగా చేపట్టనున్నారు. గతంలో రెండుసార్లు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘటన విదితమే. ఈసారి ఈ విధానం కొత్త పథకాల ప్రవేశంతో మరింత కేంద్రీకృతమవుతుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.