Telangana Budget: నగరంలో మూడు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు.. మంత్రి భట్టి

Read Time:  1 min
నగరంలో మూడు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు.. మంత్రి భట్టి
నగరంలో మూడు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు.. మంత్రి భట్టి
FONT SIZE
GET APP

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైదరాబాద్ (Hyderabad) నగరాభివృద్ధిపై బడ్జెట్ (Telangana Budget 2026-27) లో కీలక ప్రకటనలు వెలువడ్డాయి. నగర పాలనను మరింత చేరువ చేసేందుకు , మౌలిక సదుపాయాలను వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)ని పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించింది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి GHMC పునర్వవస్థీకరణ గురించి ప్రస్తావించారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలో మూడు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి ప్రకటించారు. కేవలం పాలనా సౌలభ్యం కోసమే కాకుండా, హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరాల జాబితాలో టాప్- 10 లో నిలబెట్టడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపడుతోంది.

Telangana Budget: Three new corporations to be formed in the city.. Minister Bhatti
Telangana Budget: Three new corporations to be formed in the city.. Minister Bhatti

గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి

మూడు కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు పెరుగుతున్న జనాభా , విస్తరిస్తున్న నగర పరిధిని దృష్టిలో ఉంచుకుని, జీహెచ్‌ఎంసీని మూడు వేర్వేరు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 1. గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) 2. సైబరాబాద్ (Cyberabad) 3. మల్కాజ్‌గిరి (Malkajgiri) ఈ విభజనలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల , వెలుపల ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను విలీనం చేసి కొత్త డివిజన్లు , బ్లాక్‌లను ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల అధికార వికేంద్రీకరణ జరిగి, స్థానిక సమస్యల పరిష్కారం మరింత వేగవంతం అవుతుంది. హైడ్రా (HYDRA) , సమన్వయ సంస్థ నగరంలోని వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం ప్రభుత్వం ఒక కొత్త చట్టపరమైన సంస్థను ఏర్పాటు చేయబోతోంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ బోర్డు , ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న ‘హైడ్రా’ (HYDRA) వంటి అన్ని ఏజెన్సీలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి చట్ట సవరణ చేయనున్నారు. దీనివల్ల విపత్తు నిర్వహణ, చెరువుల రక్షణ , మౌలిక సదుపాయాల కల్పనలో స్పష్టత వస్తుందని ప్రభుత్వం బడ్జెట్‌లో వివరించింది. రియల్ ఎస్టేట్ రంగానికి బూస్ట్ ఈ పునర్వ్యవస్థీకరణ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద ఊతం ఇవ్వనుంది. ముఖ్యంగా సైబరాబాద్ , మల్కాజ్‌గిరి ప్రాంతాలు స్వతంత్ర కార్పొరేషన్లుగా మారడం వల్ల ఆయా ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ , విద్యుత్ వంటి వసతులు మెరుగుపడతాయి. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం సమర్థవంతమైన అధికారులను నియమించడమే కాకుండా, పాలనలో సంస్కరణలు తీసుకురావడం వల్ల పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.