తెలంగాణ (Telangana) లో రానున్న మున్సిపల్ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. స్థానిక సంస్థల ఎన్నికలను రాజకీయంగా కీలకంగా భావిస్తున్న బీజేపీ, ఈ ఎన్నికల ద్వారా ప్రజల్లో తన బలాన్ని చాటాలని వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను అధికారికంగా విడుదల చేయనున్నారు.
Read Also: Telangana: ఆ వాహనంపై 2శాతం ట్యాక్స్ రద్దు
ప్రజల మద్దతుపై సందేహాలు
కాంగ్రెస్ రెండేళ్ల పాలన విఫలమైందని, అంతకు ముందు BRS పదేళ్లలో అభివృద్ధి లేదని బీజేపీ విమర్శిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని కోరుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు సంవత్సరాలు ఉండటంతో ప్రజల మద్దతుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలో లేకున్నా కేంద్రం ద్వారా నిధులు తెస్తామని బీజేపీ నేతలు హామీ ఇస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also