భూ భారతి – రైతులకు రక్షణ కవచం
తెలంగాణ భూ పరిపాలనలో నూతన అధ్యాయానికి నాంది పలికేలా భూ భారతి చట్టాన్ని రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా అమలు చేయనున్నట్టు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇప్పటికే గత నెల 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నాలుగు జిల్లాల్లో నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్గా నిర్వహించినట్టు తెలిపారు. అదే విధంగా మే 6వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేసి మొత్తం 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రజాకోణంలో తీసుకువచ్చిన ఈ భూ భారతి చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించేందుకు ఈ సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు.ఈ కార్యక్రమాల్లో ప్రతికలెక్టర్ హాజరై రైతులు, ప్రజలు లేవనెత్తే సందేహాలకు వారికి అర్ధమయ్యే భాషలో వివరాలు అందించాలని సూచించారు. భూమిపై ఉన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో రూపొందించిన ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్లకు సూచించారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి వ్యవస్థ రైతులకు భయానక అనుభవాలను మిగిల్చిందని, అనేక కుటుంబాలు భూ సమస్యలతో బాధపడినట్టు తెలిపారు. గత పదేళ్లలో భూ హక్కుల విధ్వంసం జరిగిందని, దీన్ని సరిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో భూ భారతి చట్టం తీసుకువచ్చామని పేర్కొన్నారు.

Telangana : రైతుల భూములకు న్యాయం చేసే మార్గం
ఈ చట్టం అమలు చేయడం వల్ల ప్రజలకు న్యాయం జరిగే అవకాశముందని, అధికార యంత్రాంగం ప్రజలకు చేరువై వారి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. గత ప్రభుత్వంలో భూ సమస్యలపై ప్రజలు కోర్టుకే వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రభుత్వమే వారి వద్దకు వస్తోంది. భూ భారతి అమలు కాబోయే మండలాల్లో ఆదిలాబాద్ నుంచి యాదాద్రి వరకు 28 మండలాలను ఎంపిక చేశారు. వీటిలో భరోజ్, సుజాతనగరం, నడికుడి, బుగ్గారం, ఘన్పూర్, రేగొండ, ఇటిక్యాల్, సైదాపూర్, పెంచికల్ పేట్, దంతాలపల్లి, మూసాపేట్, భీమారం, చిల్పిచిడ్, కీసర, పెంట్లవల్లి, నక్రేకల్, కుంతాల, మెండోరా, ఎలిగేడ్, రుద్రంగి, కుందుర్గ్, కొండాపూర్, అక్కన్నపేట, గరిడేపల్లె, ధరూం, గోపాలపేట, వర్ధన్నపేట, ఆత్మకూర్ ఉన్నాయి.ఈ సదస్సులు ద్వారా భూ సమస్యలు వాస్తవికంగా లెక్కించబడి పరిష్కార దిశగా ముందుకెళ్లే అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఆశిస్తోంది. భూ భారతి ద్వారా రైతులకు భద్రతతో పాటు భూ హక్కులను బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా ఉంది.
Read More : Harish Rao : ఫీజు రీయింబర్స్మెంట్పై హరీష్ రావు ఫైర్