हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telangana Assembly sessions : అసెంబ్లీ సమావేశాలు KCR కండీషన్‌తో BRS వ్యూహం ఏమిటి?

Sai Kiran
Telangana Assembly sessions : అసెంబ్లీ సమావేశాలు KCR కండీషన్‌తో BRS వ్యూహం ఏమిటి?

Telangana Assembly sessions : డిసెంబర్ 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరవుతారా? అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా, కొన్ని షరతులతో అసెంబ్లీకి రావడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

దాదాపు ఏడాది కాలంగా అసెంబ్లీకి దూరంగా ఉన్న కేసీఆర్, ఈసారి పక్కా వ్యూహంతో సభలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన కేసీఆర్, ప్రభుత్వ ఎజెండాను బట్టి వ్యూహాలు మార్చుకుంటూ కాంగ్రెస్ సర్కార్‌ను ఇరుకున పెట్టాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా కృష్ణా జలాల అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌కు అవకాశం ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని కేసీఆర్ స్పష్టం చేసినట్లు సమాచారం.

Read Also:  TG: ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు

అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని (Telangana Assembly sessions) ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని, ప్రజా సమస్యలపై సమగ్ర చర్చ జరగాల్సిందేనని కేసీఆర్ సూచించారు. దక్షిణ తెలంగాణకు జీవనాడిగా భావించే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకురావాలని బీఆర్ఎస్ ప్రణాళికలు రూపొందించింది. అవసరమైతే సభలో వివరాలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల పార్టీ సమావేశంలో మాట్లాడిన కేసీఆర్, కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల తెలంగాణకు, ముఖ్యంగా నీటి వాటాల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గతంలోనూ, ఇప్పుడూ తెలంగాణకు నష్టం చేస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత కేవలం సభకే పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్లి పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రాజకీయ పోరు మరింత ఉత్కంఠగా మారే అవకాశం కనిపిస్తోం

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870