చేతులు మారిన లక్షలు?
Telangana: తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో కొంతకాలంగా సాగుతున్న పేపర్ లీకేజీ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇన్ సర్వీస్ విద్యార్థులకు ప్రశ్నాపత్రాలను లీక్ చేస్తున్న ఉదంతంపై సీఐడీ అధికారులు చేపట్టిన దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తు న్నాయి. కేవలం ఈ యేడాది మాత్రమే కాకుండా, అయిదేళ్లుగా ఈ అక్రమ దందా కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా వరంగల్(Warangal), జగిత్యాల, ఆదిలాబాద్, రాజేంద్రనగర్, సిరిసిల్ల, ఆశ్వారావుపేట వ్యవసాయ కళాశాలల్లోని విద్యార్థులకు ఈ లీకైన పేవర్లు అందినట్లు సీఐడీ ప్రాథమికంగా నిర్ధారించింది.
Read Also: Naa Anveshana : ‘నా అన్వేషణ’ యూట్యూబ్ ఛానెల్ కూడా బ్యాన్ అవుతుందా?
ఈ అక్రమ మార్గం ద్వారా లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు అధికారులు భావిస్తున్నారు. పరీక్షలకు ముందే ప్రశ్నలు అందుతుండటంతో, ఇన్ సర్వీస్ కోటాలో ఉన్న వారు భారీ మొత్తాలను వెచ్చించి వీటిని కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 2025 26 విద్యా సంవత్సరానికి సంబంధించి థర్డ్ ఇయర్ ప్రశ్నాపత్రాలు బయటకు రావడం కలకలం రేపుతోంది.
ఈ వ్యవహారంలో వరంగల్ వ్యవసాయ వర్సిటీకి చెందిన జూనియర్ అసిస్టెంట్ కార్తీక్ కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో తేలింది. విశ్వవిద్యా లయం నుండి ప్రశ్నాపత్రాలను సేకరించి, ఇన్ సర్వీస్ విద్యార్థులకు చేరవేస్తున్నట్లు సమాచారం. ఈ నెట్వర్లో కేవలం కార్తీక్ మాత్ర ఉన్నాడా లేక ఉన్నతాధికారుల హస్తం కూడా ఉందా అనే కోణంలో సీఐడీ విచారణ జరుపుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: