తెలంగాణలో(Telangana) అమలులో ఉన్న చీఫ్ మినిస్టర్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కోసం రూ.500 కోట్లను కేటాయించాలని విద్యాశాఖ ప్రభుత్వంకు ప్రతిపాదనలు పంపించింది. అలాగే మిడ్డే మీల్స్ పథకానికి రూ.600 కోట్ల బడ్జెట్ను మంజూరు చేయాలని కోరింది.
Read Also: Telangana Municipal : నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు

పెరిగిన ధరలతో వ్యయ అంచనాలు పెంపు
గత ఆర్థిక సంవత్సరంలో మిడ్డే మీల్స్పై సుమారు రూ.530 కోట్లు ఖర్చయినట్లు అధికారులు తెలిపారు. అయితే గుడ్ల ధరలుపెరగడంతో పాటు ఇతర అవసరాల వ్యయం కూడా అధికమవడంతో ఈసారి అంచనాలను పెంచుతూ కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు.
రాష్ట్రవ్యాప్తంగా 28 వేల స్కూల్స్లో అమలు
రాష్ట్రంలోని దాదాపు 28 వేల ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని కొనసాగించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. విద్యార్థుల పోషణ స్థాయి మెరుగుపడేలా ఈ పథకాలు కీలకంగా నిలుస్తాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: