📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Telangana: కష్టాల్లో మొక్కజొన్న రైతు

Author Icon By Pooja
Updated: October 4, 2025 • 11:11 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : రాష్ట్రంలోని రైతులు మొక్కజొన్నకు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు చెప్పిన రేటుకే అమ్ముకోవాల్సి వస్తుంది. దీనికి తగినట్లుగా వర్షాల నుంచి మొక్కజొన్నను(Corn) కాపాడుకోవడం కత్తిమీద సామే అవుతుంది.

Read Also: John Wesley: ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్పై ప్రభుత్వం స్పష్టతనివ్వాలి

రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 5,73,648 ఎకరాలు కాగా, ఈ ఖరీఫ్ సీజనులో 118.79 శాతం మేర 6,81,432 ఎకరాల్లో సాగైంది. గత ఏడాది ఇదే సీజనులో 5,69,305 ఎకరాల్లో సాగు కాగా, అంతకన్నా ఈసారి 1.12 లక్షల ఎకరాల్లో ఎక్కువగా మొక్కజొన్న సాగు చేయడం విశేషం. అత్యధికంగా రాష్ట్రంలోని కొత్తగూడెం జిల్లాలో 96,882 ఎకరాల్లో, రంగారెడ్డిలో 68,654 ఎకరాల్లో, మహబూబాబాద్ 62,566 ఎకరాలు, నాగర్ కర్నూలులో 56,906 ఎకరాలు, నిజామాబాద్ 52,093 ఎకరాల్లో, కామారెడ్డిలో 50,728 ఎకరాలు, మహబూబ్నగర్లో 37,700 ఎకరాలు, జగిత్యాలలో 32,463 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు, అయితే ఇటీవల కాలంలో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు నిజామాబాద్, కామారెడ్డి, కొత్తగూడెం తదితర జిల్లాలో మొక్కజొన్న రైతులను ముంచాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 వేలకు పైగా ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతింది.

వర్షాలతో ఆరబోసిన మొక్కజొన్న పంట తడిసి ముద్దైంది. దీంతో మొక్కజొన్న పంట రంగు మారుతుంది. గింజ ఆరక ముందే నానడంతో గింజలకు మొలకలొచ్చే ప్రమాదం ఏర్పడింది. దీంతో పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదోనని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో దళారుల ఆధిపత్యం కొనసాగుతోంది. సహకార సంఘాలు, మార్క్ఫెడ్ ద్వారా మక్కలు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నాణ్యతను బూచీగా చూపించి దళారులు క్వింటాకు 5.1,600 5. 1,900 ల వరకు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. కేంద్రం మొక్క జొన్నకు మద్దతు ధర క్వింటాకు 5.2,400 .

అయితే ప్రభుత్వ(Government) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు మాత్రం తమ ఇష్టానుసారంగా మొక్కజొన్నకు ధర డిసైడ్ చేసి వారు అనుకున్న రేట్లకే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతు న్నారు. నిజామాబాద్ తదితర జిల్లాల్లో రైతులు పండించిన మొక్కజొన్న పంట చేతికొచ్చి దాదాపు కోతలు కూడా పూర్తి కావస్తున్నాయి. అయినా ప్రభుత్వం ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల ఊసెత్తడం లేదు. కోతలు కోసి గింజను రోడ్లపై ఆరబెట్టుకున్న రైతులు వర్షాల భయంతో దళారులకు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా మొక్కజొన్న కొనుగోలుకేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రభుత్వం ప్రారం భించే కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభమవు తాయో గ్యారంటీ లేదనే అభిప్రాయంతో తక్కువ ధరకైనా అమ్ముకునేందుకు రైతులు దళారుల వైపే మొగ్గు చూపుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News in Telugu Corn Farmers crop damage Heavy Rains Maize Crisis Nizamabad district Telangana Farmers Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.