📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana: ఇంటర్ పరీక్షలకు 96.54 శాతం హాజరు

Author Icon By Tejaswini Y
Updated: March 3, 2026 • 11:28 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana : రాష్ట్రంవ్యాప్తంగా సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు 96.54 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ వార్షిక పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. సోమవారం నుంచి సబ్జెక్టు పరీక్షలు ప్రారంభం కాగా.. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు మేథమెటిక్స్, పొలిటికల్ సైన్స్, బొటనీ పేపర్-1 పరీక్షలు జరగాయి. వాటిలో మహబూబాబాద్ జిల్లాలో ఒక మాల్ ప్రాక్టీస్ కేసు మాత్రమే నమోదైనట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఒక ప్రకటనలో తెలిపారు.

Read Also: Majid Ebnelreza appointment : యుద్ధ వేళ ఇరాన్ నిర్ణయం, తాత్కాలిక రక్షణ మంత్రిగా మాజిద్

Telangana: 96.54 percent attendance in Inter exams

లాంగ్వేజెస్ పరీక్షలు

నాలుగు రోజులపాటు ఇంటర్ విద్యార్థులకు లాంగ్వేజెస్ పరీక్షలు జరిగాయి. సోమవారం జరిగిన ఇంగ్లీష్ పేపర్-2 పరీక్షల సందర్భంగా రాష్ట్రంలోని కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో మాల్ ప్రాక్టీస్
మహబూబాబాద్లో లో మాల్రాక్టీస్ కేసు కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. శనివారం జరిగిన మేథమేటిక్స్ పేపర్-1, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1 పరీక్షలకు సెట్ బిని ఎంపిక చేసినట్టు తెలిపారు. సోమవారం జరిగిన పరీక్షలకు 96.54 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలకు 5,50,563 మంది హాజరు కావల్సి ఉండగా.. వారిలో 5,31,782 మంది విద్యార్థులు హాజరయ్యారు.

మహబూబాబాద్ జిల్లాలో ఒక మాల్ ప్రాక్టీస్ కేసు నమోదైనట్టు సెక్రటరీ తెలిపారు. ఇంటర్ బోర్డు నుంచి రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల్లో అబ్జర్వర్స్ పరీక్షల సరళిని పరిశీలించి, పరీక్షా కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. సంస్కృతం పేపర్-1, పేపర్-2 జవాబు పత్రాల మూల్యాంకనం రేపటి (బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. ఎక్కువ మంది విద్యార్థులు సంస్కృతం పరీక్షను రాస్తున్న నేపథ్యంలో ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ముందుగానే సంస్కృతం జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ముందుగానే ఈ నెల 4 నుంచి ప్రారంభించనున్నారు. ఇక మిగిలిన పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనాన్ని ఈ నెల 15 నుంచి ప్రారంభించి 20 వరకు మూడు విడతలుగా నిర్వహించనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Inter Exam Attendance Percentage Krishna Aditya IAS Telangana Inter Exams 2026 TS Intermediate Board

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.