Hyderabad: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణా బాధ్యతలను ఉపాధ్యాయులకు (Teachers) అప్పగించటం సరైన నిర్ణయం కాదని ఎస్టయు టిఎస్ మండిపడింది. ఈ నిర్ణయంతో విద్యారంగా సంక్షోభానికి దారి తీస్తుందని.. వెంటనే ఈ ఉత్తర్వులను విరమించుకోవాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు పర్వత్ రెడ్డి (Parvath Reddy), రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్ (Sadanandam Gowda) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల పనితీరును పర్యవేక్షించడానికి ఎస్టటి, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను (Teachers) పర్యవేక్షణ అధికారులుగా నియమించి.. వారికి పర్యవేక్షణా బాధ్యతలు అప్పగించడం సరికాదని.. ఇది విద్యారంగ తిరోగమన చర్య అని విమర్శించారు.
629 మండలాలు 1,817 క్లస్టర్ల పరిధిలో ఉన్న 24,146 పాఠశాలలను తనిఖీ చేయడానికి పది సంవత్సరాలు అనుభవం ఉన్న సుమారు రెండు వేలకుపైగా ఉపాధ్యాయులకు తనిఖీ బాధ్యతలు అప్పగించి విద్యా సంవత్సరం పొడవునా వారిని తనిఖీ బాధ్యతలలో ఉంచడంవల్ల, వారు సేవలందిస్తున్న ఆయా పాఠశాలలలో బోధన స్తంభించి పోతుందని.
ఫలితంగా విద్యా ప్రమాణాలు మరింత కుంటుపడతాయన్నారు. ప్రభుత్వం రాష్ట్రమంతా అన్ని పాఠశాలలో విద్యా ప్రమాణాల పెంపుకు చర్యలు తీసుకుంటామని చెబుతూనే ఇలాంటి చర్యలకు పాల్పడడం అనాలోచితమన్నారు.
కామన్ సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కరించి పూర్తిస్థాయి మండల విద్యాధి కారు (ఎంఈవో)లను, ఉప విద్యాశాఖ అధికారు(డిప్యూటీ డిఈవో)లను, విద్యాశాఖాధికారు (డీఈవో)లను నియమించి పాఠశాలల పర్యవేక్షణ కొనసాగించాలని డిమాండ్ చేశారు. తరగతికి ఒక గది, తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయిస్తూ విద్యాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికీ పాఠశాలల్లో వేలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండడంవల్ల బోధన కుంటుపడుతుందని.. వెంటనే డీఎస్సీ ప్రకటించి ఉపాధ్యాయుల నియామకాలను చేపట్టాలని పర్వత రెడ్డి, సదానంద్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read also: Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేయాలి- ఎఐసిసి ఇన్చార్జి మీనాక్షి నటరాజన్