📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి..

Telugu News: Suryapet Crime: సర్పంచ్ ఎన్నికల ఘర్షణలో BRS నేత హత్య

Author Icon By Pooja
Updated: December 10, 2025 • 12:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో జరుగుతున్న సర్పంచ్‌ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలో(Suryapet Crime) నూతనకల్‌ మండలం లింగంపల్లిలో ప్రచార వేళ కాంగ్రెస్‌ మరియు బీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగి ఒకరి ప్రాణం కోల్పోయిన ఘటన కలకలం రేపింది.

Read Also: Bangalore : గ్యాస్ గీజర్ లీక్ వల్ల రెండు ఘటనల్లో ముగ్గురి మృతి

Suryapet Crime: BRS leader killed in Sarpanch election clash

రాజకీయ విభేదాలు హింసాత్మక రూపం దాల్చడంతో కాంగ్రెస్‌కు చెందిన సుమారు 70 మంది కార్యకర్తలు కర్రలు, రాళ్లతో బీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో బీఆర్‌ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య తీవ్రంగా గాయపడి, హైదరాబాద్‌కు తరలించే సమయంలో మార్గమధ్యంలో మృతి చెందాడు. అలాగే బీఆర్‌ఎస్(BRS) మండల అధ్యక్షుడు మున్నా మల్లయ్య యాదవ్ సహా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఇప్పటికే అప్రమత్తం చేసినప్పటికీ మరో హత్య

జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ నర్సింహ(Suryapet Crime) ముందస్తు జాగ్రత్త సూచనలు జారీ చేసినప్పటికీ ఘోర ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. గత ఏడాది ఇదే గ్రామంలో మాజీ సర్పంచ్ హత్యకు గురైన సంఘటన నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎన్నికల సమయంలో మొత్తం 1500 మంది పోలీసు సిబ్బంది, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు, స్ట్రైకింగ్ ఫోర్స్, ప్రత్యేక బలగాలు నియమించబడినట్లు ఎస్పీ తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపట్టామని పేర్కొన్నారు.

అదేవిధంగా గత ఎన్నికల్లో కేసుల్లో ఉన్నవారు, పాత నేరస్తులు, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న 1284 మందిని ముందస్తుగా బైండోవర్ చేసినట్లు కూడా వెల్లడించారు. అలాగే మద్యం అక్రమ రవాణాపై దాడులు నిర్వహించి రూ.9.5 లక్షల విలువైన 1425 లీటర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇంతకున్నా గ్రామంలో పెద్ద మొత్తంలో పోలీసులు ఉన్న సమయంలోనే హత్య జరిగి ఉండటం స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu Political Violence Telangana Panchayat elections

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.