हिन्दी | Epaper
బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Supreme Court: 4 వారాల్లో రెగ్యులర్ డిజిపిని నియమించాలి

Tejaswini Y
Supreme Court: 4 వారాల్లో రెగ్యులర్ డిజిపిని నియమించాలి

Supreme Court : తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ యూపీఎస్సీ..సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది. డీజీపీ నియామకాన్ని సస్పెండ్ చేయాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. వాదనలు విని విచారణను ముగించింది.

Read Also: Telangana: నేడు బీజేపీ మేనిఫెస్టో రిలీజ్

Supreme Court: Regular DGP should be appointed within 4 weeks
Supreme Court: Regular DGP should be appointed within 4 weeks

తెలంగాణ ప్రభుత్వం, యుపిఎస్సీకి సుప్రీంకోర్టు ఆదేశం

ఇటీవల తెలంగాణ హైకోర్టు డీజీపీ నియామకాన్ని సవాల్ చేసిన పిటిషన్ ను కొట్టివేస్తూ.. పూర్తిస్థాయి డీజీపీ నియామక ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని యూపీఎస్సీతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు. ఈ ప్రక్రియను యూపీఎస్సీ, తెలంగాణ ప్రభుత్వం సమన్వయంతో నిర్వహించాలని స్పష్టంగా ఆదేశించింది. ఈ విషయంలో హైకోర్టు తీర్పును సుప్రీం న్యాయస్థానం సవరించింది. గత ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని యూపీఎస్సీ(UPSC) సహా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అర్హత కలిగిన అధికారుల జోన్ ఆఫ్ కన్సిడరేషన్లో వారి పరస్పర ప్రతిభ(ఇంటర్-సే మెరిట్) ఆధారంగా ఎంపిక జరతాలని పేర్కొంది.

తెలంగాణ ఒక్కటే కాదని ప్రకాశ్సంగ్ తీర్పును పట్టించుకోకుండా డిజిపి నియామకానికి ప్రతిపాదనలు పంపని రాష్ట్రాలు మరికొన్ని ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. రెగ్యులర్ డిజిపి స్థానంలో యాక్టింగ్ లేదా అడ్ట్రాక్ డిజిపిలను నియమించే విధానం పెరిగిందని, దీంతో ఆలస్యం వల్ల అర్హత కలిగిన సీనియర్ అధికారులకు అన్యాయం జరుగుతోందని అభిప్రాయపడింది. డిజిపి నియామకానికి సంబంధించి రాష్ట్రాలు సమయానికి ప్రతిపాదనలు పంపేలా వారికి లేఖ రాసేందుకు యుపిఎస్సీకి అధికారం ఇస్తున్నామని తెలిపింది.

రాష్ట్రాలు స్పందించకపోతే ప్రకాశ్సింగ్ కేసులో యుపిఎస్సీ దరఖాస్తు దాఖలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అవసరమైతే సంబంధిత రాష్ట్రాలపై బాధ్యత, జవాబు దారీతనం పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సుప్రీంకోర్టు తీర్పుతో తెలంగాణ లో రెగ్యులర్ డీజీపీ నియామకంపై నెలకొన్న అనిశ్చితి తొలిగే అవకాశం కనిపిస్తోంది. నాలుగు వారాల్లో నియామకం పూర్తి కావాల్సి ఉండటంతో రాష్ట్ర పోలీస్ పరిపాలనలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశముంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870