Latest News: TG: తెలంగాణలో సుమధుర గ్రూప్ రూ.600 కోట్ల పెట్టుబడి

Read Time:  1 min
Latest News: TG: తెలంగాణలో సుమధుర గ్రూప్ రూ.600 కోట్ల పెట్టుబడి
FONT SIZE
GET APP

తెలంగాణ (TG) ను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యానికి మద్దతుగా ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ సుమధుర గ్రూప్ భారీ పెట్టుబడికి శ్రీకారం చుట్టింది. రూ.600 కోట్ల పెట్టుబడికి సంబంధించి ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదర్చుకుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగిన తెలంగాణ (TG) రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో ఈ ఒప్పందం జరిగింది. సుమధుర గ్రూప్ రాబోయే రెండు సంవత్సరాల కాలంలో రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.

Read Also: Tony Blair Institute : టోనీ బ్లెయిర్ ప్రశంసలు: తెలంగాణ పాలనా విధానం యూకే మార్పులను గుర్తుచేస్తుంది

ప్లగ్-అండ్-ప్లే సౌకర్యాలను అందించనుంది

100 ఎకరాల్లో గ్రేడ్ A+ పార్క్‌ను రెండు సంవత్సరాల్లో నిర్మించి, 8 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నారు. ఏరోస్పేస్, ఆటో, ఫార్మా, ఇ-కామర్స్ రంగాలకు ఈ గ్రూప్ ఇది ఆధునిక సదుపాయాలను అందిస్తుంది. ఈ కొత్త పారిశ్రామిక పార్క్.. ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్, ఇ-కామర్స్ రంగాలకు అవసరమైన అత్యాధునిక ప్లగ్-అండ్-ప్లే సౌకర్యాలను అందించనుంది.

Sumadhura Group invests Rs. 600 crore in Telangana
Sumadhura Group invests Rs. 600 crore in Telangana

పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో ఈ పార్క్ ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఇందులో మాడ్యులర్ తయారీ బ్లాక్‌లు,లాజిస్టిక్స్ జోన్‌లు, గ్రీన్ డెవలప్‌మెంట్ ప్రమాణాలు, అత్యుత్తమ మౌలిక సదుపాయాలు ఉంటాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.