హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ సవరణ బిల్లు 2025 (Stamp Amendment Bill 2025)ను తీసుకురానుంది. దీని ద్వారా భూముల ధరలు సవరించబడతాయి. మహిళలకు స్టాంప్ డ్యూటీలో ప్రత్యేక తగ్గింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆస్తి విలువలో 6 స్టాంప్ వ్యాటీగా విధించే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు 5 (Registration charges 5rs), బదిలీ సుంకం 1.5 గా ఉండనున్నాయి. ఈ నిర్ణయం మహిళా సాధికారతకు, రియల్ ఎస్టేట్ పారదర్శకతకు దోహదపడుతుందని భావిస్తున్నారు.

త్వరలో కొత్త స్టాంప్ సవరణ బిల్లు-2025
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని జామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఊరటనిచ్చేలా నిర్ణయం తీసుకుంది. వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే లక్ష్యంతో త్వరలో కొత్త స్టాంప్ సవరణ బిల్లు 2025 (Stamp Amendment Bill 2025)ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ బిల్లులో భాగంగా ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా భూముల ధరలను సవరించాలని (Land prices should be revised.) నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచించారు. ఈ నిర్ణయాల మధ్య, మహిళలకు ప్రత్యేకంగా స్టాంప్ డ్యూటీలో తగ్గింపు ఇవ్వాలని ప్రభుత్వం ఒక సంచలనాత్మక తీర్మానం చేసింది. ఇది మహిళా సాధికారతకు, వారి ఆర్ధిక భద్రతకు దోహదపడుతుందని భావిస్తున్నారు. కొత్త స్టాంప్ సవరణ బిల్లు 2025 అమల్లోకి వస్తే స్టాంపు డ్యూటీ ఆస్తి విలువలో 6 శాతంగా విధించే అవకాశం ఉంది. ఈ మొత్తంలో చేర్చబడతాయి.
ఆస్తి విలువలో 0.5 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జ్
ఆస్తి రిజిస్ట్రేషన్ సమయంలో ఆస్తి విలువలో 0.5 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జ్ లు వసూలు చేయ నున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఆస్తి ఇతరుల పేరిట బదిలీ చేసినప్పుడు, ఆస్తి విలువలో 1.5 శాతం బదిలీ నుంకం చెల్లించేలా చట్టంలో పొందుపరచ నున్నారు. ఈ మార్పులు రియల్ ఎస్టేట్ రంగానికి, సాధారణ ప్రజలకు స్పష్టతను, స్థిరత్వాన్ని ఇస్తాయని అంచనా. ఈ నూతన విధానం ద్వారా మహిళలకు స్టాంప్ డ్యూటీలో ప్రత్యేక రాయితీ లభించడం ఒక విప్లవాత్మక చర్యగా భావించవచ్చు. ఇది మహిళలు ఆస్తులను తమ పేరు మీద రిజిస్టర్ చేసుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది. తద్వారా వారికి ఆర్థిక భద్రతను, ల్యాండ్ రిజిస్ట్రేషన్లలో స్టాంప్ డ్యూటీ తగ్గింపు కొత్త చట్టసవరణ తర్వాతే అంటున్న అధికారులు రిజిస్ట్రేషన్, బదలీ ఛార్జీలు కూడా సామాజిక గుర్తింపును అందిస్తుంది. కుటుంబంలో మహిళల ప్రాధాన్యతను పెంచడంతో పాటు, వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే ప్రభుత్వ లక్షాయానికి ఇది అద్దం పడుతుంది. ఈ బిల్లు ద్వారా భూముల విలువలు వాస్తవ మార్కెట్కు దగ్గరగా వస్తాయి. ఇది రియల్ ఎస్టేట్ లావాదేవీలలో పారదర్శకతను పెంచు తుంది. అలాగే.. ప్రభుత్వానికి కూడా గణనీయమైన రెవెన్యూ సమకూరుతుంది. ఈ సంస్కరణలు తెలంగాణలో మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా బలం చేకూరుస్తాయి. అయితే ఇది చట్ట సవరణ తర్వాతే కుదురుతుందని అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా ఇది దీర్ఘకాలికంగా సానుకూల ప్రభావాలను చూపుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Bonalu 2025: అంగరంగవైభవంగా లాల్ దర్వాజ మహంకాళి బోనాలు వేడుకలు