సృష్టి ఆస్పత్రి సరోగసి స్కాం కేసు
Srushti Hospital: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సృష్టి సరోగసి స్కాం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ED) విచారణ వేగాన్ని మరింత పెంచింది. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో నిందితులుగా వున్న సృష్టి ఆసుపత్రి నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతతో పాటు ఆమె కుటుంబీకులు, ఆసుపత్రి నిర్వాహకులను ఏడాదిన్నర క్రితం హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. పదుల సంఖ్యలో శిశు వులను అక్రమంగా కొనుగోలు చేసి ఈ శిశువులు పిల్లలు పుట్టని వారు సరోగసి కోసం వచ్చిన సమయంలో అంటగట్టి లక్షలాది రూపాయలను డాక్ట ర్ నమ్రత బృందం దండుకున్నట్లు వెలుగు చూడడం విదితమే.
Hyderabad Gas Shortage: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం..హైదరాబాద్లో దోశ, పూరి, వడ బంద్!
మనీలాండరింగ్ కోణంలో ఈడీ విచారణ
ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా వున్న అనేక చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో డాక్టర్ నమ్రత కు సంబంధాలున్నట్లు వెలుగు చూడగా దీనిపై వెంటనే రంగంలో దిగిన ఈడీ అధికారులు మనీలాండరింగ్ కోణంలో విచారణ చేబట్టారు. ఈ కేసు లో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన డాక్టర్ నమ్రత బృందాన్ని ఈడీ అధికారులు మరోసారి అరెస్టు చేసి విచారణ చేబట్టి అక్రమాలను రట్టు చే శారు. ఈ క్రమంలో మంగళవారం నాడు డాక్టర్ నమ్రతో పాటు ఆమె కుటుంబీకులకు చెందిన 50 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేశారు. జప్తు అయిన ఆస్తుల్లో ఆసుపత్రితో పాటు స్థిరచరాస్తులు వున్నాయి. 2014 నుంచి సృష్టి ఆసుపత్రిలో సరోగసి స్కాం కొనసాగుతుందని ఈడీ విచారణలో తేలింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: