📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల

Smitha Sabarwal : స్మితా సబర్వాల్‌పై కాంగ్రెస్ నేత ఘాటు వ్యాఖ్యలు

Author Icon By Divya Vani M
Updated: April 23, 2025 • 8:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కి సంబంధించిన అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వ విధానాలపై ఆమె చేసిన ఒక పోస్ట్, పెద్ద దుమారానికే దారి తీసింది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం తీవ్రంగా స్పందించారు.ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు ఎలా విమర్శలు చేస్తారు? అని ప్రశ్నించారు.ప్రభుత్వ జీతం తీసుకుంటూ, వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారని ఆయన మండిపడ్డారు.“ఆమె ఐఏఎస్ అధికారిణి.ఏం యాక్షన్ చేస్తుందబ్బా? అంటూ ఆయన మాటల తూటాలు పేల్చారు. గచ్చిబౌలి భూముల అంశంపై ఆమె పెట్టిన పోస్ట్‌కు సంబంధించి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనికి కాంతం ఘాటుగా స్పందించారు.ఇప్పుడే నిజం గుర్తొచ్చిందా? పదేళ్లపాటు కేసీఆర్ పక్కనే ఉండినప్పుడు ప్రశ్నించలేదేంటి?” అని అన్నారు. గత ప్రభుత్వంలో ఆమె కీలక స్థాయిలో ఉన్నారని గుర్తు చేశారు.తెరాస పాలనలో అడవులు నాశనమయ్యాయి. 13 లక్షల చెట్లు నరికేశారు.

Smitha Sabarwal స్మితా సబర్వాల్‌పై కాంగ్రెస్ నేత ఘాటు వ్యాఖ్యలు

జింకలు, వన్యప్రాణులు పరారయ్యాయి.ఆ సమయంలో ఆమె మౌనంగా ఎందుకు ఉన్నారు? అని నిలదీశారు.ఇప్పుడు ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టే ధైర్యం వస్తుందేంటి?” అని తీవ్రంగా ప్రశ్నించారు.అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఆమెకు పదవిలో ఉన్నప్పుడు భయం ఉండిందా? అని కూడా అడిగారు.కేసీఆర్, కేటీఆర్‌లు హెలికాప్టర్లలో తిరిగినట్టు, ఆమె కూడా తిరిగారని విమర్శించారు.ఆ సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఆమె ఎలా కలిసిపోయారు?” అని కాంతం వ్యాఖ్యానించారు.ఒక అధికారి తాను పనిచేస్తున్న ప్రభుత్వంపై ఇలా ఎలా మాట్లాడతారు? అంటూ మండిపడ్డారు.“ఇది అధికార పరిమితికి భంగం కాదా?” అని ప్రశ్నించారు.ఇంతటి ఘాటైన వ్యాఖ్యలపై అధికార వర్గాలు స్పందించాల్సిన అవసరం ఉంది.ప్రభుత్వ విధానాలను అధికారులే విమర్శిస్తే, ప్రజల నమ్మకం ఎటు పోతుందో అనేది ప్రశ్న.ఇప్పుడు ఈ వివాదం రాజకీయంగా పెద్ద దుమారానికే దారి తీస్తోంది.అధికార పార్టీల్లోనే కాకుండా ప్రతిపక్షాల్లోనూ ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.ఐఏఎస్ అధికారిణి పాత్ర, ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు, ప్రభుత్వ విధానాలపై ఆమె స్వేచ్ఛ గురించి ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.కానీ, స్మితా స్పందన మాత్రం ఇంకా రాలేదు.ఇదే తరహా వ్యవహారాలు ప్రజాస్వామ్యంలో అధికారుల నైతిక బాధ్యతను గుర్తుచేస్తున్నాయి.ఇప్పుడు అందరి దృష్టి ఆమె తర్వాతి అడుగుపై ఉంది.

Read Also : Revanth Reddy : హైకోర్టు మెట్లెక్కిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి!

Gajjela Kantham comments on Smita IAS officer government criticism KCR government tree cutting issue Panchayat over Smita Sabharwal post Smita Sabharwal and KTR connection Smita Sabharwal IAS news Telangana bureaucrat social media post Telangana political controversy 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.