📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Adilabad : పిడుగుల ధాటికి ఆరుగురు మృతి

Author Icon By Sudheer
Updated: June 12, 2025 • 8:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ (Adilabad ) జిల్లాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన ఘటన జరిగింది. బుధవారం సాయంత్రం ఆకస్మిక వర్షాలకు తోడు పిడుగుల (Lightning Strikes) బీభత్సం జనం ప్రాణాలను బలిగొంది. జిల్లాలోని బేల మండలంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడిన ఘటనలో వ్యవసాయ పనులు చేస్తున్న నందిని (30), సునీత (35) అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు.

గాదిగూడ మండలంలో గుడిసెలపై పిడుగు

గాదిగూడ మండలం పిప్పిరిలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. అక్కడ పొలాల్లో పని చేస్తున్న 14 మంది వర్షం రావడంతో సమీపంలోని గుడిసెలో ఆశ్రయం తీసుకున్నారు. అయితే అప్పటికే మేఘాలు అలముకున్న ఆకాశంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో గుడిసె పైకప్పు ధ్వంసమైంది. ఈ ఘటనలో సిడాం రాంబాయి, పెందూర్ మనోహర్, పెందూర్ సంజన, భీంబాయి అనే నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ప్రభుత్వ స్పందన అవసరం

ఈ విషాద ఘటనలపై ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయంతోపాటు అన్ని రకాల సాయం చేయాల్సిన అవసరం ఉంది. పిడుగుల వల్ల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల పరిస్థితి చూస్తే గుండెదెబ్బ తినకమానదు. ప్రస్తుత వర్షాకాలంలో రైతులు పొలాల్లో పని చేస్తున్న సమయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. పిడుగుల హెచ్చరికలు, రక్షణ చర్యలపై గ్రామస్థాయిలో అవగాహన పెంపొందించాలి.

Read Also : Boeing Shares Crash : ఫ్లైట్ ప్రమాదం.. అమెరికాలో బోయింగ్ షేర్లు భారీగా పతనం

ADILABAD Google News in Telugu Lightning strikes six people died

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.