Siddipet School Bus Accident: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ వద్ద రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రావుస్ స్కూల్ బస్సు విద్యార్థులను ఎక్కించుకుంటున్న సమయంలో, వెనుక నుండి వచ్చిన ఒక సిమెంటు లారీ బలంగా ఢీకొట్టింది.
Read Also:Indore Fire Accident: ఇండోర్లో ఘోర అగ్నిప్రమాదం: ఏడుగురు సజీవదహనం!
ఈ ఘటనలో బస్సులో ఉన్న తొమ్మిది మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని, క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: