మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు
హస్తం గుర్తు.. రైతుల పాలిట మొండి హస్తంగా మారిందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు (Thanniru Harish Rao) మండిపడ్డారు. నంగునూర్ మండలం నర్మెట గ్రామం లోని అయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ని ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… కరెంటు కోత.. ఎరువులకు గోస.. రైతు బంధు ఎగవేత.. బోనస్ బోగస్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలు రైతులకు చేసిన మేలు ఎందో ఒక్కటి చెప్పాలన్నారు.
Read Also: OU: రాష్ట్రపతి ఉద్యానవనాన్ని సందర్శించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు
సిద్దిపేట జిల్లాల పరిధిలో 2 లక్షల ఎకరాలకు సాగు నీరు
కాళేశ్వరం ప్రాజెక్టు పై సీఎం రేవంత్ రెడ్డి కక్ష్య కట్టారన్నారు. రూ.30 నుంచి 40 కోట్లు ఖర్చు చేస్తే మెదక్ సిద్దిపేట (Siddipet) జిల్లాల పరిధిలో 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే వీలు ఉందన్నారు. మేడిగడడ్డ బ్యారేజ్ అవసరం లేకుండానే కన్నెపల్లి పంపు హౌజ్ ను ప్రారంభించి సాగునీరు అందించే వీలు ఉందన్నారు. కావాలనే కక్ష్య కట్టి నీళ్లు రాకుండా చేస్తున్న దుర్మార్గమైన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. సిద్దిపేట కు రేవంత్ రెడ్డి వస్తే రుణమాఫీ కాని రైతులతో నిలదీస్తాం అన్నారు. అయిల్ ఫాం ఫ్యాక్టరీ తో పాటుగా రిఫైనరి యూనిట్ ప్రారంభించాలని ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు.
రుణ మాఫీ చేస్తానని దేవుళ్ల మీద ఒట్టు బెట్టి నమ్మ పలికిన రైతులను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలో 22 వేల మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. సిద్దిపేట వస్తే రుణ మాఫీ కాని రైతులతో అడిగించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. చెప్పిన తర్వాతే పూనిస్తాం.. ఎంతమంది పోలీసులు వస్తరో చూస్తాం అని హరీష్ రావు అన్నారు. ఆశోక్ నగర్ లో సినిమా థియేటర్ ఓపెనింగ్ కు వెళుతున్న సీఎం రేవంత్ రెడ్డి సెంట్రల్ లైబ్రరీకి వెళ్లి..తొక ముడుచుకొని వెళ్లితే నిరుద్యోగ యువతను మోసం చేసినట్లే అని భావించాల్సి ఉంటుందని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: