పెళ్లితో ఒక్కటైన జంట ఆనందసాగరంలో మునిగితేలియాడుతూ ఉంటారు. మనసుకు నచ్చిన భాగస్వామి దొరకడం తమ జీవితధన్యత అనుకుని, తమ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు, ఆశయాలతో వివాహపు తొలిఅడుగులను ప్రారంభిస్తారు. ఆకాశమే తమ హద్దుగా హానిమూన్ కు ప్లాన్ చేసుకుంటారు.
Read also : Volcani Erruption: 12 వేల ఏళ్ల తర్వాత ఇథియోపియా అగ్నిపర్వతం విస్ఫోటం
బంధువులు, మిత్రుల వద్దకు వెళ్లి, వారి ఆతిధ్యాన్ని స్వీకరిస్తూ, ఉల్లాసమనసుతో వారితో సందడి చేస్తూ, చిల్ అవుతుంటారు. ఎన్నో మధురమైన జ్ఞాపకాలను తమ పెళ్లిపుస్తకంలో సిరాఅక్షరాలుగా మలచుకుంటారు. కానీ అనుకోని ఉపద్రవం ఎదురైతే ఆ వేదన వర్ణించలేనిది.పెళ్లై పట్టుమని కొన్నిరోజులైనా కాలేదు. ఆ దంపతులను విధివంచింది.
ప్రమాదంలో మరణించిన నవవధువు
సిద్ధిపేట (Siddipet Crime)జిల్లా మీరుదొడ్డి మండలం చెప్యాల గ్రామంలో ప్రణతి(24), సాయికుమార్ లు ఇటీవల వివాహం చేసుకున్నారు. ఉద్యోగరీత్యా బైక్పై హైదరాబాద్ (Hyderabad) ఈ జంట వెళ్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి, వీరి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వధువు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, నవవరుడు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పెళ్లైన కొన్ని రోజులకే వధువు మరణించడం, వరుడు గాయపడ్డంతో బంధువులు, కుటుంబసభ్యులు, గ్రామస్తులు తీవ్రవిషాదంలో మునిగిపోయారు. తమ బిడ్డల పాలిట మృత్యవాహనంగా వచ్చిన ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read also :