రాష్ట్రంలో విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ (SFI) పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమైంది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్(Fee Reimbursement) మరియు స్కాలర్షిప్ బకాయిలను తక్షణం విడుదల చేయాలంటూ రేపు (బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత, ప్రొఫెషనల్ విద్యాసంస్థలు, యూనివర్సిటీలను బంద్ చేయాలని పిలుపునిచ్చింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ బకాయిల కారణంగా ఇబ్బందులు పడుతున్నారని, వేలాది మంది విద్యార్థులు ఫీజులు చెల్లించలేక చదువును మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎస్ఎఫ్ఐ(SFI) నాయకులు తెలిపారు.
Read also: TRAI: కొత్త ఫీచర్: కాలర్ పేరు ఫోన్లో ప్రత్యక్షం!

ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ కాలేజీలు రేపు బంద్లో పాల్గొననున్నట్లు సమాచారం. కొన్ని విద్యాసంస్థలు ఇప్పటికే సెలవు ప్రకటించాయి. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాల్లో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.
వర్షాల ప్రభావంతో పాఠశాలలకు కూడా హాలిడే
ఇక మరోవైపు, రాష్ట్రంలో కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. సిద్దిపేట, కరీంనగర్, యాదాద్రి-భువనగిరి, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పాఠశాలలకు రేపు హాలిడే ఇచ్చినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా విద్యా శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యా రంగం ఒకవైపు విద్యార్థి బంద్తో, మరోవైపు వర్షాల కారణంగా మూతపడనుంది. రేపటి రోజు పాఠశాలలు, కాలేజీలలో చలనం లేకుండా నిశ్శబ్దంగా మారే అవకాశం ఉంది.
ఎస్ఎఫ్ఐ ఎందుకు బంద్ పిలిచింది?
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయిలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ రాష్ట్రవ్యాప్తంగా బంద్ పిలిచింది.
ఎక్కడ ఎక్కడ స్కూల్ హాలిడే ఉంది?
సిద్ధిపేట, కరీంనగర్, యాదాద్రి-భువనగిరి, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: